AP News: 250వ రోజుకు ఉక్కు ఉద్యమం.. 25గంటల నిరవధిక దీక్ష 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమం 250వ రోజుకు చేరుకుంది.

Updated : 19 Oct 2021 13:49 IST

విశాఖ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమం 250వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాలు 25గంటలు నిరవధిక దీక్ష చేపట్టాయి. 250మందికి పైగా కార్మికులు ఈ దీక్షలో పాల్గొన్నారు. నవంబర్‌ 1వ తేదీ విశాఖలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పోరాటం మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని