Omicron: ఏపీలో ఒమిక్రాన్.. ఆ 40 మందికి కొవిడ్ పరీక్షలు చేశాం: డీఎంహెచ్వో
జిల్లా ఒమిక్రాన్ కేసు నమోదుకావడంపై డీఎంహెచ్వో డా. రమణకుమారి స్పందించారు.
విజయనగరం: జిల్లా ఒమిక్రాన్ కేసు నమోదుకావడంపై డీఎంహెచ్వో డా. రమణకుమారి స్పందించారు. ఈనెల 5న ఐర్లాండ్ నుంచి సదరు వ్యక్తి జిల్లాకు వచ్చారన్నారు. విదేశాల నుంచి వచ్చాక విశాఖలో తన అత్తవారింటికి వెళ్లాడని.. బాధితుడికి వైద్యసిబ్బంది ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. దీంతో స్వాబ్ నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఈనెల 6న హైదరాబాద్ సీసీఎంబీకి పంపారని.. ఒమిక్రాన్గా అక్కడ నిర్ధారణ అయిందని డీఎంహెచ్వో వివరించారు.
బాధితుడికి శనివారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో నెగటివ్ వచ్చిందని రమణకుమారి చెప్పారు. బాధితుడిని కలిసిన 40 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించామని.. వారికి నెగటివ్ వచ్చిందని తెలిపారు. బాధితుడి స్వగ్రామంలోనూ కొవిడ్ పరీక్షలు చేస్తున్నామన్నారు. అతడి ఇంటి పరిసరాల్లో సుమారు వంద మందికి టెస్టులు చేస్తున్నామని.. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఎంహెచ్వో అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!