TTD: మూడో ఘాట్ రోడ్డు.. అన్నమయ్య మార్గం అంటే ఇదేనా!
కలియుగ వైకుంఠం తిరుమలకు మరో ఘాట్రోడ్డును నిర్మించనున్నారు. ఈ మార్గం శేషాచలం అటవీప్రాంతం మీదుగా సాగుతుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు
ఇంటర్నెట్డెస్క్ : కలియుగ వైకుంఠం తిరుమలకు మరో ఘాట్రోడ్డును నిర్మించనున్నారు. ఈ మార్గం శేషాచలం అటవీప్రాంతం మీదుగా సాగుతుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఈ మార్గం మీదుగానే తిరుమలకు చేరుకున్నారు. ఈ మార్గంలో తిరుపతికి చేరుకునే అవకాశం ఉండదు. నేరుగా తిరుమలకు చేరుకోవచ్చు. రేణిగుంట మండలంలోని కరకంబాడి-బాలపల్లి మధ్యన రైల్వే మార్గానికి పశ్చిమభాగంలో ఈ మార్గం ప్రారంభమవుతుంది. ఇప్పటికీ అనేకమంది కడప జిల్లా వాసులు ఈ మార్గం ద్వారానే స్వామివారి సన్నిధికి చేరుతుంటారు. సాళువ నరసింహరాయలు అనంతరం విజయనగర ప్రభువుల కాలంలో ఈ మార్గాన్ని వినియోగించుకునే వారు.
రెండు ఘాట్రోడ్ల నిర్మాణమిలా..
కాలక్రమంలో ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడటంతో తిరుపతి నుంచి తిరుమలకు 1944లో మొదటి ఘాట్రోడ్ అంటే తిరుమల నుంచి తిరుపతికి వచ్చేది. ఈ మార్గాన్ని బ్రిటిష్ హయాములో నిర్మించారు. అనంతరం 1970ల్లో రెండో ఘాట్రోడ్డు నిర్మాణం జరిగింది.
అన్నమయ్య మార్గంలో నేరుగా తుంబురు కోనకు..
అన్నమయ్య మార్గంలో నడిస్తే నేరుగా తిరుమలలోని తుంబురు కోనకు చేరుతాం. ఇప్పటికీ తిరుపతికి చెందిన అనేక ట్రెక్కింగ్ క్లబ్బుల సభ్యులు ఈ మార్గం నుంచి ట్రెక్కింగ్ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ మార్గంలో శతాబ్దాల నాటి సత్రాలను ఇప్పటికీ చూడవచ్చు. అయితే ఎర్రచందనం దొంగలు, వారిని పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ పోలీసుల ప్రవేశంతో పరిసరప్రాంతాలైన బాలపల్లి, మామండూరు గ్రామాల ప్రజలు చాలా తక్కువగా ఈ మార్గంలోకి ప్రవేశిస్తుంటారు. ఈ మార్గాన్ని నిర్మించాలని కడప జిల్లా రాజంపేట, కోడూరుకు చెందిన పలువురు రాజకీయనాయకులు, శ్రీనివాసుని భక్తులు ఏటా ఈ మార్గం ద్వారా యాత్ర నిర్వహిస్తారు.
అన్నమయ్య స్వస్థలం కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామం. అక్కడ నుంచి బయలుదేరిన ఆయన ఈ మార్గం ద్వారానే తిరుమలకు చేరారు. ఈ మార్గమే కాకుండా మరో మార్గం కూడా ఉంది. దీని ద్వారా కేవలం అటవీశాఖ సిబ్బంది మాత్రమే బీట్ నిర్వహిస్తుంటారు. తిరుమలకు చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చేందుకు పలు మార్గాలుంటాయి. అయితే రక్షితప్రాంతం కావడంతో ఎక్కువమంది సౌకర్యాలున్న తిరుపతికి చేరుకొని అలిపిరి, శ్రీవారిమెట్టు ద్వారా కాలినడకన, వాహనాల్లో వచ్చేవారు రెండో ఘాట్రోడ్డు ద్వారా స్వామిసన్నిధికి చేరుతుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా