YV Subbareddy: తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి రెడ్డి నియమితులయ్యారు.

Updated : 08 Aug 2021 13:47 IST

అమరావతి: తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తితిదే ఛైర్మన్‌గా సుబ్బారెడ్డిని నియమించింది. ఇటీవలే ఆయన పదవీకాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తికి తితిదే ఛైర్మన్‌గా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ మళ్లీ సుబ్బారెడ్డినే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే తితిదే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని