Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..
1. రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సభ్యలు బృందం కర్నూలు జిల్లాలో పర్యటించింది. ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించిన అనంతరం, పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని బోర్డు సభ్యులు పరిశీలించారు. గత కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి ఎన్జీటీ, కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.
2. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు నాదే: ఈటల
హుజూరాబాద్లో అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్కు బానిసే అని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస రూ.కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. హుజూరాబాద్లో కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
3. ఎదురుదెబ్బలు తగిలినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు: అశోక్
హైకోర్టు తీర్పును మరోసారి స్వాగతిస్తున్నట్లు మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా అశోక్గజపతిరాజు చెప్పారు. అనేక ఎదురుదెబ్బలు తగిలినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం నియామకాలు చేపట్టి ట్రస్టు ప్రతిష్టను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఈవో తనను కలవలేదని.. తన ఆదేశాలను పట్టించుకోవడం లేదని తెలిపారు.
4. ఏపీపై రాహుల్ దృష్టి .. సీనియర్ నేతలతో మంతనాలు
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ అధిష్ఠానం సంకల్పించింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో రాహుల్ గాంధీ చర్చలు జరుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు తదితరులు బుధవారం రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు.
5. ఓబీసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఓబీసీల జాబితా రూపకల్పనలో రాష్ట్రాలకు ఇదివరకు ఉన్న అధికారాలను పునరుద్ధరించడానికి వీలు కల్పించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్సభ ఆమోదం తెలపగా.. బుధవారం రాజ్యసభలో సైతం విపక్ష సభ్యులు ఏకతాటిపైకొచ్చి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఈ బిల్లును సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్ ప్రవేశపెట్టారు.
6. గత ప్రభుత్వ తప్పును మేం సరిచేశాం.. సీఐఐ సదస్సులో ప్రధాని మోదీ
గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తాము సరిదిద్దామని ప్రధాని మోదీ అన్నారు. రెట్రోస్పెక్టివ్ (పాత తేదీల నుంచి వేసే పన్ను) పన్నునుద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. దీని రద్దు ద్వారా ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాలకు నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. ఈ మేరకు సీఐఐ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ ఆర్థికవ్యవస్థ వేగం పుంజుకుంటోందని చెప్పారు.
7. 3 ఏళ్లలో ఎన్జీవోలకు రూ.49వేల కోట్ల విదేశీ నిధులు
గడిచిన మూడేళ్లలో భారత్లోని 18వేలకు పైగా ఎన్జీవోలకు రూ. 49వేల కోట్ల మేర విదేశీ నిధులు అందాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2017-18లో రూ. 16,940.58 కోట్లు, 2018-19లో 16,525.73 కోట్లు, 2019-20లో 15,853.94 కోట్ల నిధులను ఎన్జీవోలు విదేశీ సంస్థల నుంచి స్వీకరించినట్లు రాయ్ తెలిపారు.
8. బెంగళూరులో 242 మంది చిన్నారులకు పాజిటివ్.. ‘థర్డ్’ భయంతో అధికారుల అలర్ట్!
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కొవిడ్ మరోసారి కలకలం రేపింది. గత ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారే. వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఈ వైరస్ బారినపడ్డారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఈ మేరకు డేటా వెల్లడించింది.
9. రాహుల్ ఖాతాను లాక్ చేశాం.. హైకోర్టుకు తెలిపిన ట్విటర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను లాక్ చేసినట్లు ట్విటర్ దిల్లీ హైకోర్టుకు తెలిపింది. దిల్లీలోని దళిత బాలిక హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేలా ట్వీట్ చేసిన రాహుల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ట్విటర్ ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడించింది.
10. బూమ్.. బూమ్.. మళ్లీ దూసుకొచ్చిన బుమ్రా!
టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో పైకి దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో తిరిగి టాప్-10లో ప్రవేశించాడు. బ్యాటింగ్లో విఫలమైన విరాట్ కోహ్లీ ఒక స్థానం పడిపోయి ఐదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. శతకం బాదేసిన ఇంగ్లాండ్ సారథి జోరూట్.. కోహ్లీని అధిగమించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం