హలో..! మీ డెత్ సర్టిఫికెట్ వచ్చి తీసుకువెళ్లండి..
అతడి పేరు చంద్రశేఖర్ దేశాయ్. మహారాష్ర్టలోని ఠాణే వాసి. రోజులాగే పనిలో నిమగ్నమై ఉన్నాడతను. అప్పుడే ఒక కాల్ వచ్చింది. అప్పటి దాకా సరదాగా ఉన్న ఆవ్యక్తి కాస్త.. ఆ ఫోన్ కాల్ మాట్లాడటంతో ఒక్కసారిగా
ఆ ఫోన్ కాల్తో ఒక్కసారిగా ఖంగుతిన్న వ్యక్తి
ఠాణే: అతడి పేరు చంద్రశేఖర్ దేశాయ్. మహారాష్ర్టలోని ఠాణే వాసి. రోజులాగే పనిలో నిమగ్నమై ఉన్నాడతను. అప్పుడే ఒక కాల్ వచ్చింది. అప్పటి దాకా సరదాగా ఉన్న ఆవ్యక్తి .. ఆ ఫోన్ కాల్ మాట్లాడటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ‘‘సార్..ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాం.. వచ్చి మీ మరణ ధ్రువీకరణ పత్రం (డెత్సర్టిఫికెట్) తీసుకెళ్లండి’’ అన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. అసలేమి జరిగిందో తెలుసుకోవాలనే ఆరాటం మొదలైన చంద్రశేఖర్ వెంటనే ఠాణే మున్సిపల్ కేంద్రానికి ముందుగా తాను బతికే ఉన్నానని తెలియజేశాడు. ఆపై తనకు వచ్చిన కాల్ వివరాలను వెల్లడించాడు. వెంటనే స్పందించిన ఠాణే మున్సిపల్ కమిషనర్ సందీప్ మాల్వీ తగిన వివరణ ఇచ్చారు. ‘‘ దీనికి అసలు కారణం టెక్నికల్ ఎర్రర్. ఈ జాబితా మేము తయారుచేసినది కాదు, పుణె మున్సిపల్ కార్యాలయం నుంచి మాకు అందింది. ఇదే అంశంపై మళీ ఒకసారి సమీక్షించాలని మా బృందానికి ఆదేశాలు జారీ చేశాం అంటూ వివరించారు. కాగా బతికి ఉన్న వ్యక్తికే ఇలాంటి ఫొన్ కాల్ రావడంతో ఈ వార్త కాస్త ట్విటర్లో వైరల్గా మారింది. ఇదేదో యమధర్మరాజుకే పంపించాల్సిందని ఒకరంటే.. నేనింకా బతికే ఉన్నా ఇంకా చనిపోలేదన్న ఫన్నీ మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు