Richest Indian womens: వ్యాపారాలను పరుగులు పెట్టించారు..బిలియనీర్లుగా ఎదిగారు..
ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన తొలి వంద మంది సంపన్నుల జాబితాలో ఆరుగురు భారతీయ మహిళలూ చోటు దక్కించుకోవడం
ఇంటర్నెట్ డెస్క్: ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన తొలి వంద మంది భారతీయ సంపన్నుల జాబితాలో ఆరుగురు మహిళలూ చోటు దక్కించుకోవడం విశేషం. మగవారితో సమానంగా తమ వ్యాపారాలను పరుగులు పెట్టిస్తూ.. అధికంగా లాభాలు ఆర్జించి ఈ జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరిలో ఒ.పి.జిందాల్ గ్రూపు ఛైర్పర్సన్ సావిత్రి జిందాల్ 7వ స్థానంలో నిలిచారు. 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆమె నికర సంపద ఒక ఏడాదిలోనే 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. గతేడాది ఆమె ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు.
‣ మహిళల్లో రెండో అతిపెద్ద ధనవంతురాలిగా ప్రముఖ వ్యాపారవేత్త, ‘హావెల్స్ ఇండియా’ సంస్థకు చెందిన వినోద్ రాయ్ గుప్తా నిలిచారు. ఆమె ఫోర్బ్స్ జాబితాలో 24వ ర్యాంకు దక్కించుకున్నారు. ఆమె నికర సంపద 7.6 బిలియన్ల డాలర్లుగా ఉంది.
‣ ముంబయిలోని ఔషధ, బయోటెక్నాలజీ కంపెనీ యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్పర్సన్ లీనా తివారీ 43వ స్థానంలో నిలిచారు. ఆమె నికర సంపద 4.4 బిలియన్ డాలర్లు.
‣ ప్రముఖ ఎడ్టెక్ సంస్థ ‘బైజుస్’ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్నాథ్ ఫోర్బ్స్ జాబితాలో 47వ స్థానాన్ని సంపాదించుకున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ బోధనకు ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో బైజుస్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేగంగా పుంజుకొన్నాయి. దివ్య ప్రస్తుత నికర సంపద విలువ 4.05 బిలియన్ డాలర్లుగా ఉంది.
‣ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అత్యంత సంపన్నుల మహిళల్లో ఐదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ వంద మంది సంపన్నుల జాబితాలో 53వ ర్యాంకు దక్కించుకున్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే ఆమె నికర సంపద విలువ తగ్గింది. 2020లో 4.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆమె సంపద 2021 వచ్చే సరికి 3.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
‣ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టీఏఎఫ్ఈ)కు చెందిన మల్లికా శ్రీనివాసన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. వీరి నికర సంపద విలువ 2.89 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ వంద మంది సంపన్నుల జాబితాలో 73వ స్థానంలో నిలిచారు.
‣ కాగా.. ఫోర్బ్స్ ఇండియాలో తొలి 100 మంది కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన వరుసగా 14వ సారి ఈ స్థానంలో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?