Toilet on the stairs: రూ. 3కోట్ల ఇంటికి మెట్లపై టాయిలెట్.. వైరల్గా మారిన ఫొటో
ఓ ఇంటి మెట్లపై టాయ్లెట్ ఉన్న ఫొటో తాజా ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు ఇదేం ఇల్లురా బాబూ.. అంటూ నోరెళ్లబెడుతున్నారు......
ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఇంటిని కొనుక్కోవాలనుకునేవారు అనేక విషయాలపై దృష్టి పెడతారు. బెడ్రూం, డైనింగ్ టేబుల్, వంటగది, బాత్రూం సరైన ప్రాంతంలో ఉండేలా చూసుకుంటారు. కాస్త అటూ ఇటుగా ఉన్నా.. మరో ఇంటిని వెతికే పనిలో పడతారు. అలాంటిది.. మరి ఓ ఇంటికి సంబంధించిన టాయ్లెట్ ఏకంగా మెట్లపైనే ఉంటే..! ఆ ఇంటిని ఎవరు కొంటారు చెప్పండి! ఓ ఇంటి మెట్లపై టాయ్లెట్ ఉన్న ఫొటో తాజా ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు ఇదేం ఇల్లురా బాబూ..! అంటూ నోరెళ్లబెడుతున్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉండే ఓ వ్యక్తి తన ఇంటిని అమ్మకానికి పెడుతూ.. వివరాలను జిల్లో (Zillow) అనే వెబ్సైట్లో ఉంచాడు. మూడు బెడ్రూంలు ఉండే ఆ ఇంటి ధరను 4,20,000 డాలర్లు (దాదాపు రూ.3.25 కోట్లు)గా నిర్ణయించాడు. అయితే వెబ్సైట్లో ఆ ఇంటిని చూసినవారు.. ఉండకూడని ప్రాంతంలో ఓ టాయ్లెట్ ఉండటాన్ని గుర్తించారు. ఆ టాయ్లెట్ను ఏకంగా మెట్లపై నిర్మించారు. కింద కార్పెట్ కూడా ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోను ఇంటర్నెట్లో పంచుకోగా ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ‘ఇంట్లోకి వచ్చేవారికి టాయ్లెట్ స్వాగతం చెబుతోంది, ఇంటి ఎంట్రీలోనే ఇలాంటి ఆశ్చర్యకర దృశ్యం కనిపిస్తే.. ఇంక ఇంట్లో ఎన్ని వింతలు కనిపిస్తాయో..’ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి