ఆ దేశంలో ఆనందం ఎక్కువ..!
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తున్నా.. సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి ఓ విభాగం(యూఎన్ఎస్) ప్రకటించింది. ఈ మేరకు 149 దేశాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం యూఎన్ఎస్ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ క్రమంలో గత నాలుగు సంవత్సరాలుగా ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా గడుపుతున్నట్లు సాధారణ గణాంకాలను వెల్లడించింది...
సంతోషకరమైన దేశాల జాబితా వెల్లడి..
ఫిన్లాండ్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తున్నా.. సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 149 దేశాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం వార్షిక నివేదికను విడుదల చేసింది. నాలుగేళ్లుగా ఫిన్లాండ్ ప్రజలు అందరికన్నా ఎక్కువ ఆనందంగా గడుపుతున్నట్లు వెల్లడించింది. ఐరోపా దేశాలైన డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్స్లు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే సంతోషకరమైన దేశాల్లో న్యూజిలాండ్ 9వ స్థానంలోకి రాగా... జర్మనీ 17 నుంచి 13వ స్థానానికి, ఫ్రాన్స్ 2 నుంచి 21 స్థానానికి చేరినట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఆఫ్రికా దేశాలైన లెసోతో, బోట్స్వానా, రువాండా, జింబాబ్వే చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ సంవత్సరానికి గానూ సంతోషంగా లేని (అన్హ్యాపీ) దేశాల్లో అఫ్గానిస్థాన్ తొలి స్థానంలో నిలిచిందని సర్వే అధికారులు చెబుతున్నారు.
దేశ ప్రజల ఆనందం, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక బాధ్యత, దేశ జీడీపీ, అవినీతి స్థాయులను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. తొమ్మిదేళ్లుగా సంతోషకరమైన దేశాల జాబితాలను విడుదల చేస్తున్నామని ఐరాస పరిశోధకుడు హిల్లివెల్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘కరోనా కాలంలోనూ.. ఫిన్లాండ్లో ఎక్కువ శాతం జనాభా ఆనందంగా జీవిస్తున్నారు. మహమ్మారి సమయంలో ఫిన్లాండ్ ప్రజలు వారి జీవనోపాధిని కాపాడుకొనేందుకు చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. అది వారి ముఖాల్లో కనిపించింది. ఇక్కడ విస్తారమైన అడవులు, వేలాది సరస్సులు , నిశ్శబ్ద వాతావరణం ఉండటం ప్రజల జీవనానికి అనుకూలం ’అని హిల్లివెల్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్