అరె! అచ్చుగుద్దినట్టు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా ఉన్నాడే!
ఏంటీ.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా ఇలా రోడ్ మీద చాట్ అమ్ముతున్నారేంటి అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈయన సీఎం కేజ్రీవాల్ కాదు కాబట్టి. మరి ఈయన ఎవరనేదేగా మీ ప్రశ్న. ఈయన పేరు గుప్తా.
ఇంటర్నెట్ డెస్క్: ఏంటీ.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా ఇలా రోడ్ మీద ఛాట్ అమ్ముతున్నారేంటి అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈయన సీఎం కేజ్రీవాల్ కాదు కాబట్టి. మరి ఈయన ఎవరనేదేగా మీ ప్రశ్న. ఈయన పేరు గుప్తా. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ బైక్పై ‘గుప్తా ఛాట్ భండార్’ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అచ్చుగుద్దినట్టు అరవింద్ కేజ్రీవాల్లా ఉండటమే ఈయన ప్రత్యేకత. ఫుడ్ బ్లాగర్ కరణ్ దువా ‘దిల్ సే ఫుడీ’ యూట్యూబ్ ఛానెల్లో ఈ డూప్ అరవింద్ కేజ్రీవాల్ గురించి ప్రపంచానికి తెలిసింది.
ఇక గుప్తాతో మాట కలిపితే ఆనందంగా మాట్లాడారు ‘‘ గ్వాలియర్లోని మోతీ మహాల్ దగ్గర ఛాట్ సమోసా, గులాబ్జామున్, పాపిడి ఛాట్, దహీ దాబా అమ్ముతుంటా. చాలా మంది నన్ను అరవింద్ కేజ్రీవాల్లా ఉన్నావ్ అంటుంటారు. చలికాలంలో మఫ్లర్ ధరిస్తే... క్రేజీవాల్కి మరింత దగ్గరగా పోలికలతో ఉన్నావ్ అని చెబుతుంటారు’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోని 2లక్షల మందికి పైగా వీక్షించగా అరవింద్ కేజ్రీవాల్, గుప్తా ఒక్కసారైనా కలుసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది