Viral videos: కుల్లడ్ పిజ్జా.. కేరాఫ్ సూరత్
పిజ్జా.. నోరూరించే ఈ ఇటాలియన్ డిష్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. గుండ్రటి పిజ్జా బేస్పై సాస్ అప్లై చేసి, వివిధ కూరగాయలు లేదా మాంసం ముక్కలతో టాపింగ్ చేసి, దానిపై ఛీజ్ పరిచి చేస్తుంటారు. ఇది సాధారణంగా అందరికి తెలిసిన రకం పిజ్జా. కానీ.. కుల్లడ్ పిజ్జా గురించి విన్నారా?...
ఆకట్టుకుంటున్న తయారీ విధానం.. వైరల్గా మారిన వీడియో
ఇంటర్నెట్ డెస్క్: పిజ్జా.. నోరూరించే ఈ ఇటాలియన్ డిష్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. గుండ్రటి పిజ్జా బేస్పై సాస్ అప్లై చేసి, వివిధ కూరగాయలు లేదా మాంసం ముక్కలతో టాపింగ్ చేసి, దానిపై ఛీజ్ పరిచి చేస్తుంటారు. ఇది సాధారణంగా అందరికి తెలిసిన రకం పిజ్జా. కానీ.. కుల్లడ్ పిజ్జా గురించి విన్నారా? పేరే వింతగా ఉంది కదూ. అవును.. తయారీ విధానం కూడా అంతే. గుజరాత్లోని సూరత్లో ఓ దుకాణదారుడు.. పిజ్జా బేస్ లేకుండానే కుల్లడ్(మట్టి గిన్నె)లో దీన్ని తయారు చేస్తూ, ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. దీని తయారీ కోసం.. మొదటగా ఉడికించిన మొక్కజొన్న పొత్తులు, తరిగిన టమాటాలు, పన్నీర్ ముక్కలు, కెచప్, మయోనీస్, వివిధ రకాల సాస్లతో మిశ్రమాన్ని తయారు చేసి.. చిన్న మట్టి కుండలో నింపుతున్నాడు. అనంతరం.. ఆ మిశ్రమంపై మళ్లీ సాస్లు, ఉప్పు, చాట్ మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెద్ద ఎత్తున ఛీజ్ వేస్తున్నాడు. గిన్నె పూర్తిగా నిండాక, మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి.. వేడివేడిగా అందిస్తున్నాడు. ఆకట్టుకునేలా ఉన్న ఈ తయారీ వీడియోను ‘ఆమ్చీ ముంబయి’ అనే ఛానల్ యూట్యూబ్లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్గా మారింది. ఇప్పటివరకు దాదాపు 23 లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లూ ఈ వీడియోపై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘ఈ వీడియో గనుక చూస్తే ఇటలీకి చెందిన మా బామ్మ మాపై యుద్ధం ప్రకటిస్తుంది’ అని ఒకరు, ‘అతని ప్రయత్నాన్ని అభినందించండి. నేను భారతీయుడిగా గర్వపడుతున్నా. మేం ఎప్పుడూ వినూత్న పరిష్కారాలు కనుగొంటాం’ అని మరొకరు.. ‘ఫస్ట్ టైం బేస్ లేని పిజ్జా చూస్తున్నా’.. ‘ఇది పిజ్జా కాదు.. ‘పాట్’జా’.. ‘అద్భుతమైన వంటకం, సృజనాత్మకంగా ఉంది. తినేందుకు ఎదురుచూస్తున్నా..’ ఇలా పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. దీని తయారీ వీడియోను మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కాదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్