Telangana News: తెలంగాణకు దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం తెచ్చిన 3 శాఖలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టె మూడు శాఖలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో పోటీ పడి ఆదాయాన్ని తీసుకొచ్చాయి. వాణిజ్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టె మూడు శాఖలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో పోటీ పడి ఆదాయాన్ని తీసుకొచ్చాయి. వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అబ్కారీ శాఖలు రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాయి. వాణిజ్య పన్నుల శాఖ అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే రూ.13 వేల కోట్లు అధికంగా రాబడిని తెచ్చిపెట్టింది. రిజిస్ట్రేషన్ల శాఖ అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో దాదాపు రూ.12వేల కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించింది. అబ్కారీ శాఖలో రూ. 30వేల కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. ఎక్సైజ్ సుంకం కింద రూ.17వేల కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అబ్కారీ శాఖ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.14వేల కోట్ల ఆదాయం సమకూరింది. అంటే 2021-22లో రూ.3వేల కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.
వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వ్యాట్, జీఎస్టీల రాబడి అనూహ్యంగా పెరిగింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో రూ.52,436 కోట్ల రాబడి రాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.65వేల కోట్లు వచ్చింది. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 2020-21లో రూ.5,260 కోట్ల రాబడి రాగా, 2021-22లో రూ.12,364 కోట్లు ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22లో ఈ మూడు శాఖల నుంచి రెట్టింపునకు మించి ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ ఫీజులతోపాటు భూముల మార్కెట్ విలువలు పెంచడంతో రాబడి పెరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పేర్కొంది. ఈ మూడు శాఖల నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.94,500 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో వచ్చిన మొత్తం కంటే దాదాపు రూ. 23వేల కోట్లు అధికమని అధికారులు తెలిపారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో ఈ మూడు శాఖల ద్వారా వచ్చే ఆదాయం 1.20 లక్షల కోట్లుగా ఉండొచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్