Ship Journey: ఎంత దయనీయం.. ఉపాధి కోసం ఓడ చుక్కానిపైనే 11 రోజులు ప్రయాణం!
జీవనోపాధి కోసం పేద దేశాలకు చెందిన ప్రజలు సంపన్న దేశాలకు వలసపోతున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా వారు ప్రయాణిస్తున్న తీరు ప్రపంచ దేశాలన నివ్వెరపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అభివృద్ధి పథంవైపు పయనిస్తుంటే.. మరికొన్ని దేశాల్లో మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉన్నచోట జీవనోపాధి కరవై, పట్టెడన్నం కోసం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని సంపన్న దేశాలకు వలసపోతున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా నైజీరియా నుంచి యూరప్కు వెళుతున్న ఓ నౌకలో ముగ్గురు వలస జీవులు ప్రయాణించిన తీరు, అక్కడి దయనీయ పరిస్థితికి అద్దంపడుతోంది.
అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అలిథిని-2 (Alithini II) అనే నౌక చమురు, రసాయనాలతో నైజీరియా నుంచి యూరప్కు ప్రయాణిస్తోంది. 11రోజుల ప్రయాణం తర్వాత ఈ నౌక స్పెయిన్లోని క్యానరీ ఐలాండ్ తీరానికి చేరింది. ఆ సమయంలో స్థానిక కోస్ట్ గార్డులు ఓడ చుక్కానిపై ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉండటం గమనించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నైజీరియాలోని లాగోస్ నుంచి ఓడ చుక్కానిపై కూర్చుని ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురిలో 11 ఏళ్లలోపు బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోను సాల్వమెంటో మెరైన్ సంస్థ ట్విటర్లో షేర్ చేసింది.
11 రోజులపాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించడం వల్ల ముగ్గురు డీహైడ్రేషన్కు గురికావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వలసదారుల దయనీయస్థితి ఈ ఫొటో నిదర్శనం’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘నేను ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వాడినే, మా దేశాల్లో ఈ పరిస్థితికి ఆఫ్రికా దేశాలను పాలిస్తున్న నాయకుల విధానాలే కారణం. వారు అభివృద్ధికి వ్యతిరేకం. నలభై ఏళ్లపాటు ఒకే వ్యక్తి ఎలా దేశాన్ని పాలిస్తాడు’’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 2011 తర్వాత ఉత్తర ఆఫ్రికా ప్రాంతం నుంచి పాశ్చాత్య దేశాలకు వలస వచ్చే వారి విషయంలో నిబంధనలు కఠినతరం చేయడంతో కొందరు ఇలా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి..
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం