Kakinada: చిక్కినట్లే చిక్కి.. బోను వద్దకు వచ్చి వెనుదిరిగిన పులి.. వీడియో
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో దాదాపు రెండు వారాలుగా పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది.
ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో దాదాపు రెండు వారాలుగా పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పులి సంచరించిన దృశ్యాలు మరోసారి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అటవీ సిబ్బంది పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో మూడు బోన్లు ఏర్పాటు చేసి పశు మాంసం ఎరగా వేశారు. నిన్న అర్ధరాత్రి తర్వాత పులి శరభవరంలో ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చి వెనుదిరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది.
పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవులపాలెం, పోతులూరు ప్రాంతాల్లో ఆహారం, వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే ఉంటూ వేటాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పులికి నాలుగైదేళ్ల వయసు ఉండి దూకుడుగా ఉన్నట్లు వారు తెలిపారు. పులిని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ అధికారులు మరో రెండు బోన్లను ఏర్పాటు చేస్తున్నారు.
పులి సంచారంతో రెండు వారాలుగా కంటి మీద కునుకులేకుండా జీవిస్తున్నట్లు ప్రత్తిపాడు మండలంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పులికి భయపడి వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అటవీ అధికారులు త్వరతగతిన పులిని బంధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్