Tirumala: కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు.

Updated : 30 Sep 2022 11:02 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో ఛర్నాకోల్‌ చేతబట్టి రాజమన్నార్‌ రూపధారిగా దేవదేవుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాత్రికి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. 

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు 8 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. గురువారం శ్రీవారిని 61,879 మంది దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ద్వారా తితిదేకు 1.82కోట్ల ఆదాయం సమకూరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని