TTD: శ్రీవారి గరుడసేవకు వచ్చే భక్తులకు తితిదే కీలక సూచనలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకొని తితిదే భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది. గరుడ సేవకు వచ్చే భక్తులు తప్పని సరిగా కార్ పాసులు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకొని తితిదే భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది. గరుడ సేవకు వచ్చే భక్తులు తప్పని సరిగా కార్ పాసులు తీసుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబరు 1వ తేదీ (శనివారం) ఉదయం 6 గంటల నుంచి నిర్దేశించిన కార్ పాస్ సెంటర్ల వద్ద పాస్లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే గరుడసేవకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 3 లక్షల మందికి శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
పాసులు జారీ చేసే ప్రాంతాలు..
* కడప జిల్లా వైపు నుంచి వచ్చే భక్తులకు కుక్కలదొడ్డి సమీపంలోని కేశవరెడ్డి హైస్కూల్, కరకంబాడి రోడ్డులోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల వద్ద పాస్లు జారీ చేస్తారు.
* నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ఏర్పేడు వద్ద ఉన్న శ్రీఇంజినీరింగ్ కాలేజీలో పాస్లు ఇస్తారు.
* చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలకు వడమాలపేట టోల్ప్లాజా సమీపంలోని ఆగస్త్య ఎన్క్లేవ్ వద్ద పాస్లు జారీ చేస్తారు.
* చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ఐతేపల్లిలోని అగ్రికల్చర్ ల్యాండ్స్ వద్ద పాస్లు ఇస్తారు.
* మదనపల్లి నుంచి వచ్చే వాహనాలకు శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద పాస్లు జారీ చేయనున్నారు.
* తిరుపతి టౌన్లో ఉన్న భక్తుల వాహనాలకు భారతీయ విద్యాభవన్, జూ పార్క్ సమీపంలోని దేవలోక్, కరకంబాడి రోడ్డులోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీ, అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజిలో పాస్లు జారీ చేయనున్నారు.
*టూరిస్ట్ బస్సులకు, తితిదే నిర్ణయించిన పరిమితికి మించి ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన వాహనాలు జూపార్క్ సమీపంలో ఉన్న దేవలోక్ పార్కింగ్ స్థలంలో ఉంచాలి.
* కార్లు, జీపులు మొదలైన చిన్న వాహనాలు సైన్స్ సెంటర్కు ఎదురుగా ఉన్న భారతీయ విద్యాభవన్ స్కూల్ గ్రౌండ్లో పార్కింగ్ చేయాలి.
* ద్విచక్రవాహనాలు అలిపిరి గరుడ కూడలి వద్ద ఉన్న పాత చెక్ పాయింట్, ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్, మెడికల్ కాలేజీ గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు.
* పార్కింగ్ పాస్లు పూర్తిగా ఉచితంగా ఇస్తామని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తితిదే అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు