తిరుపతి ఏడో డివిజన్‌ ఎన్నిక రద్దు

తిరుపతి నగరపాలక సంస్థ ఏడో డివిజన్‌ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అభ్యర్థి ఫోర్జరీ సంతకంతో నామినేషన్‌ ఉపసంహరించారన్న ఫిర్యాదుపై ఎస్‌ఈసీ ఈ చర్యలు తీసుకుంది. తెదేపా అభ్యర్థి విజయలక్ష్మి..

Published : 04 Mar 2021 18:52 IST


తెదేపా అభ్యర్థి విజయలక్ష్మి

అమరావతి: తిరుపతి నగరపాలక సంస్థ ఏడో డివిజన్‌ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అభ్యర్థి ఫోర్జరీ సంతకంతో నామినేషన్‌ ఉపసంహరించారన్న ఫిర్యాదుపై ఎస్‌ఈసీ ఈ చర్యలు తీసుకుంది. తెదేపా అభ్యర్థి విజయలక్ష్మి సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ఆ పార్టీ ఎస్‌ఈకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఏడో డివిజన్‌ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నిక రద్దును వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని