Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
వ్యాపారంలో ఉన్నత స్థాయిలకు ఎదిగి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్రా, హర్ష గొయెంకా..
ఇంటర్నెట్ డెస్క్: వ్యాపారంలో ఉన్నత స్థాయిలకు ఎదిగి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్రా, హర్ష గొయెంకా ముందు వరుసలో ఉంటారు. ఆకట్టుకునే చిత్రాలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లతో ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో హర్ష గొయెంకా తాజాగా ట్విటర్లో షేర్ చేసిన వీడియో ఎందరినో కదిలించింది. దీనికి ఆనంద్ మహీంద్రా కూడా రియాక్ట్ అయ్యి ఆ వీడియోను షేర్ చేశారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?
తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధాన్ని గురించి పెన్సిల్, రబ్బర్తో పోల్చుతూ ఉన్న ఈ వీడియో సందేశాత్మకంగా ఉంటుంది. దీన్ని హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి తన ట్విటర్ ఖాతాలో తొలుత షేర్ చేశారు. పెన్సిల్ వచ్చి ముందు సారీ చెబుతుండడంతో వీడియో మొదలవుతుంది. దానికి రబ్బర్ వచ్చి ‘ఎందుకోసం సారీ’ అని ప్రశ్నిస్తుంది. ‘ఎందుకంటే నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా. నేను తప్పు చేసిన ప్రతిసారీ దాన్ని నువ్వు చెరిపేస్తున్నావు. దాంతో ఆ తప్పు కనుమరుగైపోతుంది. ఇలా చేయడం వల్ల మీలో మీరు కొంత భాగాన్ని కోల్పోతున్నారు’’ అని పెన్సిల్ సమాధానమిస్తుంది. అప్పుడు రబ్బర్ స్పందిస్తూ..‘అది నిజమే. కానీ, దాన్ని మేం పట్టించుకోం. నీకు తెలుసా? తప్పు చేసిన ప్రతిసారీ మీకు సహాయం చేయడానికే మమ్మల్ని తయారు చేశారు. ఏదో ఒక రోజు మేం పూర్తిగా కరిగిపోతామని మాకూ తెలుసు. కానీ, ఇలా చేస్తున్నందుకు మేం సంతోషంగా ఉన్నాను. మాకోసం చింతించడం మానేయండి. నువ్వు బాధపడుతుంటే చూడలేం’ అని చెబుతుంది.
రబ్బర్, పెన్సిల్ మధ్య సంభాషణను తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధంతో పోల్చుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. రబ్బర్ లాగానే తల్లిదండ్రులు కూడా ఎల్లప్పుడు పిల్లలు చేసిన తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంటారని గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ‘మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. వారితో ఎల్లప్పుడూ దయతో ఉండండి. ముఖ్యంగా వారిని ప్రేమించండి’ అనే నీతిని బోధిస్తూ వీడియో ముగుస్తుంది.
అయితే, ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. ‘‘తల్లిదండ్రుల సహజ లక్షణాన్ని ప్రతిబింబించే గొప్ప సందేశమిది. ఇది మనలాంటి వయసు మళ్లిన తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. ఇది నాకు తరచూ జరుగుతుంటుంది. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు చేసిన తప్పులు మర్చిపోయేలా వారితో ఎక్కువ సమయం గడపాలి’’ అని పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియోకు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘హృదయాలను హత్తుకునే సందేశం’ అని కామెంట్లు, రిప్లయ్లు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్