AP corona: మరోసారి 100 దాటిన మరణాలు
తాజాగా రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18వేలు దాటింది. గత 24 గంటల్లో 73,749 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 18,561మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18వేలు దాటింది. గత 24 గంటల్లో 73,749 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 18,561మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక అత్యధికంగా 109 మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
కొవిడ్ బాధపడుతూ పశ్చిమగోదావరిలో అత్యధికంగా 16మంది మృత్యువాత పడగా, అనంతపురం 10, చిత్తూరు 10, గుంటూరు 10, తూర్పుగోదావరి 9, విశాఖపట్నం 9, కృష్ణా 8, నెల్లూరు 8, విజయనగరం 8, కర్నూలు 7, శ్రీకాకుళం 7, ప్రకాశం 4, కడపలో ముగ్గురు కన్నుమూశారు. గడిచిన 24 గంటల్లో 17,334మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,80,49,054 శాంపిల్స్ పరీక్షించగా, 14,54,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,554 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనాతో బాధపడుతూ 9,481మంది మృత్యువాతపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..