AP News: ఏపీలో కొత్తగా 18వేల కరోనా కేసులు

Ap corona cases: తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా, 18,285 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది.

Updated : 26 May 2021 17:37 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా, 18,285 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. అదే సమయంలో 24,105 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 99మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 14, విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, నెల్లూరు 8, ప్రకాశం 8, విశాఖపట్నం 8, కర్నూలు 6, గుంటూరు 5, కృష్ణా 5, శ్రీకాకుళంలో ఐదుగురు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో బాధపడుతూ ఇప్పటివరకూ 10,427మంది మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని