AP News: కరోనాతో 104మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 16వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 16,167మందికి పాజిటివ్‌ వచ్చింది.

Updated : 27 May 2021 17:53 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 16వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 16,167మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,43,557కు చేరింది. మరోవైపు 21,385మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 14,46,244 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

తాజాగా కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స 104మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 13, విశాఖపట్నం 11, అనంతపురం 9, నెల్లూరు 9, గుంటూరు 8, విజయనగరం 8, ప్రకాశం 7, తూర్పుగోదావరి 6, కృష్ణా 6, కర్నూలు 6, శ్రీకాకుళం 6, కడపలో ఒకరు కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 10,531కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,728 యాక్టివ్‌ కేసులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని