Ap Corona: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా సుమారు 7వేల కేసులు నమోదయ్యాయి.

Updated : 31 May 2021 17:09 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా సుమారు 8వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా, 7,943మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ  16,93,085 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా 19,845మంది కొవిడ్‌ నుంచి కోలుకుని బయటపడ్డారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,28,360కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,53,795 యాక్టివ్‌ కేసులున్నాయి.

గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ చిత్తూరులో అత్యధికంగా 15మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 12, ప్రకాశం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 7, కృష్ణా 6, కర్నూలు 6, విజయనగరం 6, గుంటూరు 4, నెల్లూరు 4, కడపలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనాతో పోరాడుతూ 10,930మంది చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని