Ap Corona: 3వేల దిగువకు కరోనా కేసులు

కొత్తగా 2,620మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

Updated : 21 Jun 2021 16:53 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,620మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా కరోనా నుంచి 7,504మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 17,82,680కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,140 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనాతో పోరాడుతూ తాజాగా 44మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12,363 మందికి చేరింది. చిత్తూరులో అత్యధికంగా 10మంది మృతి చెందగా, గుంటూరు 5, శ్రీకాకుళం 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 3, కర్నూలు 3, ప్రకాశం 3, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరి 3, కృష్ణా 2, కడప 1, నెల్లూరు 1, విజయనగరం ఒకరు కన్నుమూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని