AP corona cases: కొత్తగా 15 వందల కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 15 వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 15 వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 59,641 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1546మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,70008కు చేరింది. మరోవైపు 1968మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,36016 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
తాజాగా కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స 15 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 5గురు మృతి చెందగా, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 13,410కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్ కేసులున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.