2020 మీమ్స్‌: మరోసారి నవ్వుదామా!

2020..కరోనా వైరస్‌తో ప్రారంభమైంది. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరం..అంటూ ఇలా రొటీన్‌గా గడుస్తుండగా, మధ్యమధ్యలో ఊరటనిచ్చే టీకా కబుర్లు.

Published : 29 Dec 2020 20:51 IST


 

2020..కరోనా వైరస్‌తో ప్రారంభమైంది. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరం..అంటూ ఇలా రొటీన్‌గా గడుస్తుండగా, మధ్యమధ్యలో ఊరటనిచ్చే టీకా కబుర్లు. శాస్త్రవేత్తల కృషి, మన ప్రార్థనలు ఫలించి టీకా వచ్చిందిలే అని అలా మాస్క్‌ తీసి సంతోషపడదాం అనుకున్నాం. అంతే, యూకే, దక్షిణాఫ్రికాలోని కరోనా కొంచెం మేకప్‌ కొట్టుకొని..సరికొత్తగా దర్శనమిచ్చింది. ఇలా ఇన్ని వార్తలు చూశాకా మన నెటిజన్లు ఊరుకుంటారా! తమ వాక్చాతుర్యాన్ని పూర్తిగా దట్టించి మీమ్స్ చేసి, తెగ నవ్వించారు. అవేంటో మరోసారి మనమూ చూద్దామా... 

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన విజృంభణను మనం చూస్తూనే ఉన్నాం. ఈ వైరస్ ప్రారంభ దశలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దాంతో ప్రజలంతా కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితయ్యారు. దాంతో వచ్చిన వర్క్‌ఫ్రమ్ హోం కష్టాలు, ఎప్పుడు గరిటె పట్టని వారి పాకశాస్త్ర ప్రతిభ, చివరగా ఔషధ సంస్థల టీకా రేసు వంటి అంశాలపై మీమ్స్ తెగ చక్కర్లు కొట్టాయి. అలాగే జనతా కర్ఫ్యూ సందర్భంగా దీపాలు వెలిగించడంపై చేసిన మీమ్ తెగ ఆకట్టుకుంది. 

పబ్జీ ఆటను నిషేధించినప్పుడు..ఆ ఆన్‌లైన్ గేమ్ ప్రియులు ఎంతగా బాధపడ్డారో తెలిసిందే. ఆ వెంటనే దానిపై బాలీవుడ్ నటుడు ఫాగ్‌-జీ పేరుతో అదే తరహా గేమ్‌ను తీసుకువస్తారనగానే నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. 

♦ ఇక ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ ఏం చేసినా కాస్త భిన్నంగానే ఉంటుంది. అదే తీరును తన కుమారుడు పేరులో చూపించడంతో నెటిజన్లు నోరెళ్లబెట్టారు. రోమన్‌ లెటర్స్, అంకెలతో..ఆయనే గుర్తు పెట్టుకోలేని పేరు పెట్టి అందరిని ఆశ్చర్యపర్చారు. 

ఘనాకు చెందిన కొందరు వ్యక్తులు శవపేటికను మోస్తూ చేసిన నృత్యం, నెట్టింట్లో ఈ ఏడాది విపరీత ఆదరణను సొంతం చేసుకుంది.

♦ అలాగే 2020 తమ ప్రణాళికలను చెల్లాచెదురు చేయడాన్ని, లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లలో ఉండటంతో కాలుష్యం తగ్గడంపైనా వచ్చిన మీమ్స్ మెప్పించాయి. అంతేకాకుండా పలు దేశాల్లో దర్శనమిచ్చిన ఏకశిలపైనా కౌంటర్లు వచ్చాయి.

ఇవీ చదవండి..  స్నేహితుడితో పాట పాడుతుంటే..జుట్టుకు నిప్పు
 













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని