Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. AP News: కొత్త పే స్కేళ్లతోనే జీతాలు.. మరోసారి సర్కారు ఉత్తర్వులు
ఇటీవల విడుదల చేసిన పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణతో ముందుకెళుతుండగా.. ఏపీ ప్రభుత్వం కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు చెల్లించేలా బిల్లుల తయారీకి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు డ్రాయింగ్ డిస్బర్స్మెంట్, ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్ అధికారులను సర్కారు ఆదేశించింది. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ను అనుసరించి బిల్లుల చెల్లించాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Virat Kohli: కోహ్లీ అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు: అక్తర్
అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయి బ్యాట్స్మెన్గా మారిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీ విషయంలో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల్ని పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని హితవు పిలికాడు. కెప్టెన్సీ అంత సులువైన విషయం కాదని.. తీవ్ర ఒత్తిడి మధ్య బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని.. కేవలం క్రికెట్పైనే దృష్టి పెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. India Corona: ఆగని కరోనా ఉద్ధృతి.. వరుసగా నాలుగో రోజూ 3 లక్షల పైనే!
దేశంలో కరోనా వైరస్ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. శనివారంతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 18,75,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,33,533 మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్తగా మరో 525 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Jacinda Ardern: ఒమిక్రాన్ ఆంక్షలు.. వివాహాన్ని రద్దు చేసుకున్న న్యూజిలాండ్ ప్రధాని
4. Pakistan: పాక్ ముక్కుపిండి పరిహారం వసూలు చేసిన చైనా..!
పాక్-చైనాలు తమ బంధాన్ని ‘ఐరన్ బ్రదర్స్ బంధం’గా చెప్పుకొంటాయి. కానీ, సొమ్ము విషయానికి వస్తే మాత్రం చైనా ఎక్కడా తగ్గదు. పాక్లో దాసు హైడ్రోపవర్ డ్యామ్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించి నష్ట పరిహారాన్ని చైనా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ దాడిలో 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2021 జులై 14వ తేదీన చైనా పాకిస్థాన్లో దాసు హైడ్రోపవర్ డ్యామ్ నిర్మాణ పనుల వద్ద భారీ ఉగ్రదాడి జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పంజాబ్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటించే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ఆయనను సమర్థించే వారి సంఖ్యా పెరుగుతోంది. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్దూ కంటే పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చన్నీకే మద్దతిస్తున్నారు. తనను కాకుండా మరెవరినైనా అధికారికంగా ప్రకటిస్తే ఎన్నికల ముంగిట్లో సిద్దూ ఎలా ప్రవర్తిస్తారోననే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Black Fungus: బ్లాక్ఫంగస్కు ‘పతంజలి’ నాసికా ఔషధం
బ్లాక్ ఫంగస్ (మ్యుకర్మైకోసిస్) వ్యాధిపై పనిచేసే సరికొత్త ఆయుర్వేదిక్ నాసికా ఔషధాన్ని (నేసల్ డ్రాప్)ను అభివృద్ధి చేసినట్లు పతంజలి సంస్థ వెల్లడించింది. ‘అనూ తైల’ పేరిట పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం దీన్ని కనుగొన్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు గాను అధునాతన సాంకేతిక విధానాలతో లోతైన పరిశోధన జరిగినట్లు పేర్కొంది. పరిశోధన వివరాలు ‘ది జర్నల్ ఆఫ్ అప్లైడ్ మైక్రోబయాలజీ’లో ప్రచురితమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Monkey Fever: కర్ణాటకలో మంకీ జ్వరం కలకలం
7. Russia: వేడి పెంచిన రష్యా!..మరిన్ని యుద్ధవిన్యాసాలకు నిర్ణయం
ఉక్రెయిన్ అంశంపై అమెరికా, రష్యాల మధ్య పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఈ రెండు దేశాల మధ్య భద్రతపరంగా చెలరేగిన అతిపెద్ద సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది సైనికులను మోహరించిన రష్యా తదుపరి వ్యూహం పశ్చిమ దేశాలకు అంతుచిక్కడంలేదు. మరోవైపు ఈ ప్రాంతంలో మరిన్ని సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన రష్యా.. వేడిని రాజేసింది. కరీబియన్ ప్రాంతంలో సైనిక మోహరింపులనూ కొట్టిపారేయలేమని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. నేతాజీకి జాతి ఘన నివాళులు.. గణతంత్ర దినోత్సవాలకు నేడు శ్రీకారం
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా భారతదేశం నేతాజీకి కృతజ్ఞతాపూర్వక నివాళులర్పిస్తోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు.. బోస్ను ‘నేషనల్ ఐకాన్’గా నిలిపాయని, ఆయన ఆశయాలు, త్యాగాలు దేశవాసులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. AP News: రూ.20కోట్ల చిట్టీలు కట్టించిన మహిళ.. అర్ధరాత్రి పరారీకి యత్నం!
చిట్టీల పేరుతో అనంతరపురంలో ఓ మహిళ సుమారు వంద మందిని బురిడీ కొట్టించింది. దాదాపు రూ.20 కోట్ల వసూలు చేసి మోసం చేసింది. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్కు చెందిన జయలక్ష్మి బ్యూటీ పార్లర్ నడుపుతూ స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తోంది. ఇరుగుపొరుగున ఉండే వాళ్లు ఆమెను నమ్మి చిట్టీలు కట్టారు. అయితే కొన్నాళ్లుగా ఆమె వారికి డబ్బులివ్వకుండా తప్పించుకొని తిరుగుతోంది. ఇదే క్రమంలో నిన్న అర్ధరాత్రి ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా బాధితులు వెంబడించి పట్టుకొని ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. Maruthi: సమయం వచ్చినప్పుడు అన్నీ రివీల్ అవుతాయ్: మారుతి
నేటితరం యువతను ఆకర్షించే విధంగా విభిన్న ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించి కెరీర్లో మంచి పేరు సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ఇటీవల ‘మంచి రోజులొచ్చాయి’ చిత్రంతో మిశ్రమ స్పందనలు అందుకున్న ఆయన ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్-ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే మారుతి తదుపరి చిత్రాల గురించి శనివారం పలు వార్తలు బయటకు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* SureshRaina: ‘పుష్ప రాజ్’గా సురేశ్ రైనా.. కొనసాగుతోన్న హవా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
తెలంగాణ నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి..
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం