Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.
1. తుది ప్రకటన రాలేదు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం: ఏపీ హైకోర్టు
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. జిల్లాల పెంపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఆర్టికల్ 371(డి)కి విరుద్ధంగా ఉన్నాయంటూ ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త జిల్లాలపై తుది ప్రకటన రానందున మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
2. స్పీకర్ సార్.. నా రాజీనామాను ఆమోదించండి: గంటా శ్రీనివాసరావు
ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ గతేడాది ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఏడాదికి పైగా ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Suman: నటుడిగా నేను అన్ని కులాలు, మతాలను గౌరవిస్తా: సుమన్
3. రెండోసారి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్గా గుత్తా ఎన్నిక
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. సుఖేందర్రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో మండలి ఛైర్మన్గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నిక అనంతరం సుఖేందర్రెడ్డి ఛైర్మన్ స్థానంలో కూర్చొన్నారు. ఆయనకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
4. ‘బాహుబలి-3’పై రాజమౌళి అదిరిపోయే అప్డేట్
తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి రికార్డులు సృష్టించాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా, ‘బాహుబలి’కి కొనసాగింపుగా ‘బాహుబలి-3’ రానుందంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
5. వీవీఎస్ లక్ష్మణ్ + రాహుల్ ద్రవిడ్ = 376
రాహుల్ ద్రవిడ్ - వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ఇండియాకు రెండు కళ్లలాంటి వారు. ఒకప్పుడు ఆటగాళ్లుగా అదరగొట్టిన వీరు.. ఇప్పుడు భారత క్రికెట్ను తమ అనుభవంతో ముందుకు నడిపిస్తున్నారు. ఒకరు హెడ్కోచ్గా పనిచేస్తుంటే.. మరొకరు జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాగా, ఈ దిగ్గజాలు సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆస్ట్రేలియాపై రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 2001లో ఈడెన్గార్డెన్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో టీమ్ఇండియాను ఫాలోఆన్ నుంచి గట్టెక్కించడమే కాకుండా.. విజయతీరాలకు తీసుకెళ్లారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Marri Shashidhar reddy: పార్టీ అధ్యక్షురాలిగా సోనియ గాంధీ కొనసాగాలి: మర్రి శశిధర్ రెడ్డి
6. భారీ ఊరట.. 24 గంటల్లో 27 మరణాలే..!
దేశంలో ఈ రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కొత్త కేసులు, మరణాల్లో గణనీయ తగ్గుదల నమోదైంది. వైరస్ వ్యాప్తి 2020 మే ప్రారంభం నాటి స్థాయికి తగ్గిపోయి భారీ ఊరటనిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో కేవలం 2,503 కేసులు, 27 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారం 5,32,332 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఈ స్థాయిలో కేసులు క్షీణించాయి. పరీక్షలు సంఖ్య తగ్గినప్పటికీ.. పాజిటివిటీ రేటు మాత్రం ఒక శాతం దిగువనే ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
7. ‘అజోవ్ బెటాలియన్’ను వదలని పుతిన్..?
ఉక్రెయిన్పై సైనిక చర్య చేపట్టినట్లు ప్రకటించిన సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిల్లో నియో-నాజీలు అనే పదాన్ని వాడారు. ఉక్రెయిన్లో నియో-నాజీలను అంతం చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా రష్యా ప్రకటనల్లో పలుసార్లు ఆ ప్రస్తావన వచ్చింది. ఇటీవల ఓ ప్రసూతి ఆసుపత్రిపై దాడి చేసిన సమయంలో కూడా సమర్థించుకొనేందుకు.. నియో-నాజీలు దానిని ఆక్రమించారని పేర్కొంది. అసలెవరు ఈ నియో-నాజీలు..? వారిపై పుతిన్కు ఎందుకంత కోపం..? మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
స్టాక్ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా తీవ్ర అస్థిరత నెలకొంది. దీంతో వరుస ఐపీఓల హవాకు బ్రేక్ పడింది. చాలా కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి మార్కెట్లు కుదురుకుంటే.. సెబీ నుంచి ఆమోదం పొందిన అనేక కంపెనీలు మార్కెట్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Video: మద్యం దుకాణంలోకి రాయి విసిరిన సీనియర్ నేత ఉమాభారతి
9. ఉక్రెయిన్పై దండయాత్ర.. చైనా సాయం కోరిన రష్యా..!
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో బాంబులు, క్షిపణుల మోత మోగుతూనే ఉంది. రష్యాను అడ్డుకునేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలు వేల కొద్దీ ఆంక్షలు విధించినప్పటికీ.. క్రెమ్లిన్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. పుతిన్ వ్యవహారంపై చర్చించేందుకు నేడు చైనాతో భేటీ కానుంది. అయితే సమావేశానికి కొద్ది గంటల ముందు అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
10. కోహ్లీకి వింత అనుభవం.. స్టేడియంలోకి పరుగెత్తుకొచ్చి అభిమానుల సెల్ఫీలు
శ్రీలంకతో జరుగుతోన్న పింక్బాల్ టెస్టులో టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి వింత అనుభవం ఎదురైంది. రెండో రోజు ఆటలో ఆదివారం రాత్రి మూడో సెషన్ జరుగుతుండగా కోహ్లీ తొలి స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు అభిమానులు ఒక్కసారిగా సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు. వాళ్లు నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, విరాట్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా దూరంగా ఉన్నాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!