Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడి
భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. కవితపై ధర్మపురి అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని తెరాస కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అప్పుడు మన్మోహన్ను.. ఇప్పుడు మోదీని అడిగాం: కేటీఆర్
ఓబీసీకి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంపై కేసీఆర్ ఆధ్వర్యంలో 2004 నుంచి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గతంలో కేసీఆర్ నేతృత్వంలో ఓబీసీ సంఘాలు దిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు. దానికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. అయితే అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వశాఖ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆ శరీర భాగాలు గుర్తిస్తే తెలియజేయండి..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెల్లడయ్యాయి. అయితే నిజాలను నిరూపించే సాక్ష్యాలను సేకరించడం మాత్రం క్లిష్టంగా మారింది. ఈ కేసు విచారణలో భాగంగా దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు కీలక చర్యలు చేపట్టారు. గుర్తుతెలియని శరీరభాగాల గురించిన వివరాలు, ఆ కేసుల సమాచారాన్ని తెలియజేయాలని అన్ని స్టేషన్లను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మస్క్ అల్టిమేటంతో ట్విటర్లో గందరగోళం!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు మార్పులు తప్పవని ప్రకటించిన మస్క్.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మొదటికే మోసమొచ్చే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అసలు ఆయన ఏం చేయనున్నారు? ట్విటర్ను ఎలా తీర్చిదిద్దనున్నారనే సంశయంతో ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను వీడేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఇంట్లోకి వచ్చేదాకా వేచిచూడొద్దు.. ఉగ్రవాదులను వెంబడించాలి: మోదీ
ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. వైద్యుడు జగ్గుస్వామికి సిట్ నోటీసులు
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో కేరళకు చెందిన వైద్యుడు డా.జగ్గుస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్యకళాశాలలో పనిచేస్తున్న జగ్గుస్వామి ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే అప్పటికే పోలీసులు వస్తున్న విషయాన్ని ఆయన తెలుసుకొని పరారయ్యాడు. జగ్గుస్వామి ఇంటితో పాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్ రాకెట్.. ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) ఈ ప్రయోగానికి వేదికైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షార్లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రైవేటు రాకెట్ ‘విక్రమ్-ఎస్’ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ.. విక్రమ్-సబ్ ఆర్బిటల్ (వీకేఎస్) ఈ ప్రైవేట్ రాకెట్ను అభివృద్ధి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఉదయ్కిరణ్ చనిపోవడానికి కారణాలు నాకు తెలుసు: తేజ
నటుడు ఉదయ్కిరణ్ ఆత్మహత్య గురించి ప్రముఖ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి తనకంతా తెలుసని అన్నారు. **అతడి జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలూ నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతా. నేను చనిపోయేలోపు ఆ విషయాలు వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్ధతి కాదు’’ అని తేజ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల కోతలు
అమెజాన్లో ప్రారంభమైన ఉద్యోగుల కోతలు ఇక్కడితో ఆగిపోవని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ తొలగింపులు కొనసాగుతాయని సీఈఓ ఆండీ జస్సీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అత్యంత కఠినమైందని తెలిపారు. వ్యయ నియంత్రణలో భాగంగా గత ఏడాది కాలంగా సమీక్ష నిర్వహించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. భారత ఆటగాళ్లకు విదేశీ లీగ్లు అవసరం లేదు: రవిశాస్త్రి
భారత ఆటగాళ్లకు విదేశీ లీగ్ల్లో అనుమతుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. టీమ్ఇండియాను వీటిలో ఆడనిస్తే అద్భుతంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం దేశీయ లీగ్లు జరుగుతున్న సమయంలో ఆటగాళ్లకు ఇందులో పాల్గొనే అవకాశమిస్తే నష్టపోయే అవకాశాలు మనకే ఎక్కువని అంటున్నారు. ఇటీవల ఈ విషయంపై రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత