Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. భారత్తో మూడో టీ20 మ్యాచ్కు న్యూజిలాండ్ కెప్టెన్ దూరం.. కారణం ఇదే!
భారత్తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(ఎన్జెడ్సీ) సోమవారం ప్రకటించింది. మంగళవారం నేపియర్ వేదికగా జరగనున్న మ్యాచ్కు ఆ జట్టు పేసర్ టిమ్ సౌథీ సారథిగా వ్యవహరించనున్నాడు. మరో ఆటగాడు మార్క్ చాప్మన్ కివీస్ జట్టులో తిరిగి చేరనున్నాడు. అయితే, శుక్రవారం టీమ్ఇండియాతో ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్కు కేన్ తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపడతాడని బోర్డు స్పష్టతనిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అప్పుల ఊబిలో పాక్.. కోట్లు గడించిన ఆర్మీ చీఫ్ బజ్వా
అప్పుల కుప్పలు నానాటికీ పెరుగుతూ పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుండగా.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా రూ. కోట్లు గడిస్తున్నారట. గత ఆరేళ్లలో ఆయన కుటుంబం సంపద అమాంతం పెరిగినట్లు తాజా కథనం ఒకటి బయటికొచ్చింది. మరికొద్ది రోజుల్లో ఆర్మీ చీఫ్గా బజ్వా పదవీకాలం ముగియనున్న సమయంలో ఈ వార్తలు బహిర్గతమవడం దేశంలో కలకలం రేపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఇప్పుడు చెప్పండి.. రాయలసీమ ద్రోహులెవరో?: చంద్రబాబు
ఏపీలో ‘జాకీ’ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు రాయలసీమ ద్రోహులు ఎవరో సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జాకీ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణపై ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని ఆయన తన ట్వీట్కు జతచేశారు. ‘‘సీమకు పరిశ్రమలు తెచ్చిన మేం ద్రోహులమా? లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన వైకాపా నేతలా? పాలకులు రాక్షసులైతే ఎలా ఉంటుందో మన రాష్ట్రమే ఉదాహరణ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. త్వరలో టెస్టుల్లోకి వస్తా: సూర్యకుమార్ యాదవ్
మిస్టర్ 360 త్వరలో భారత టెస్టు జట్టులో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం న్యూజిలాండ్పై ‘గాడ్మోడ్’లో ఆడిన 111 పరుగుల ఇన్నింగ్స్ అనంతరం అతడు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రంపై స్పందించాడు. ‘‘ కెరీర్ ఆరంభించిందే ఎర్రబంతి క్రికెట్ (టెస్టులు)తో. నా ముంబయి జట్టు కోసం ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాను. టెస్టు క్రికెట్పై నాకు మంచి అవగాహన ఉంది. ఆ ఫార్మాట్ ఆడటాన్ని నేను ఎంజాయ్ చేస్తాను’’ అని సూర్యకుమార్ తన మనసులోని మాట చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ప్లాట్ఫామ్పైకి దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. 10 బోగీలు బోల్తా
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ రైలు ప్లాట్ఫామ్ మీదకు దూసుకొచ్చింది. 10 బోగీలు బోల్తా పడగా.. వాటి కింద పడి ఇద్దరు ప్రయాణికులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు నిరీక్షించే గది సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో రైలు బోగీల కింద మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. యూపీలో ‘దిల్లీ’ తరహా హత్య.. మరో పెళ్లి చేసుకుందని ముక్కలుగా నరికిన మాజీ ప్రియుడు
దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్లో అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. ఓ యువతిని అతిదారుణంగా చంపేశాడో వ్యక్తి. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి బావిలో పడేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఓటీటీలో మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. థియేటర్లు: నవంబర్ 25- అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘తోడేలు’, ‘లవ్టుడే’. నవంబర్ 26: ‘రణస్థలి’. ఓటీటీ: నవంబర్ 23- ద స్విమ్మర్స్(నెట్ఫ్లిక్స్), గుడ్ నైట్ ఊపీ(అమెజాన్ ప్రైమ్). నవంబర్ 25- ఖాకీ: ది బిహార్ చాప్టర్(నెట్ఫ్లిక్స్), చుప్(జీ5), ప్రిన్స్(డిస్నీ+హాట్స్టార్), స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్(ఆహా), గర్ల్స్ హాస్టల్(సోనీ లివ్). పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. 270 రోజుల్లో ఉక్రెయిన్పై 4,700 క్షిపణులు..!
యుద్ధం మొదలైన తొమ్మిది నెలల్లో రష్యా దాదాపు వేలకొద్దీ క్షిపణులను ఉక్రెయిన్పై ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే స్వయంగా వెల్లడించారు. ఆయన ఆదివారం అంతర్జాతీయ సంస్థ లా ఫ్రాంకోఫోని సభ్యులతో మాట్లాడుతూ ‘‘ఈ రోజుతో యుద్ధం మొదలై 270 రోజులవుతుంది. రష్యా 4,700 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. వందల కొద్దీ ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమయ్యాయి. వేల మంది ప్రజలు మరణించారు. లక్షల మంది బలవంతంగా వలసపోయారు’’ అని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకుందామిలా..!
జీవనశైలి రుగ్మతలు, మానసిక ఒత్తిడి, వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరైంది. కరోనా సంక్షోభం అనంతర ప్రపంచంలో దీని అవసరం మరింత పెరిగిందనే చెప్పాలి. క్రమంగా ఆరోగ్య బీమా (Health Insurance) ప్రాముఖ్యత గురించి అవగాహన పెరుగుతోంది. అంతేకాకుండా, పాలసీల సంఖ్యతో పాటు బీమా మొత్తం కూడా పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. వివేకా హత్య కేసు బదిలీ.. తీర్పు వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్పై వచ్చే సోమవారం ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 21న (ఈరోజు) తీర్పు ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం.. మరో వారంపాటు దాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్ల ధర్మాసనం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్