Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. MLC Elections: ‘ఎకానమీ చిరంజీవి’... వైకాపాకు షాకిచ్చిన ఈ మాస్టారి గురించి తెలుసా?
ఆయనో విద్యావేత్త.. అర్థశాస్త్ర అధ్యాపకుడు.. రచయిత.. అసలు పేరు వేపాడ చిరంజీవిరావు (vepada chiranjeevi rao) అయినా ఎకానమీ చిరంజీవిగానే అందరికీ సుపరిచితుడు. తెదేపా (TDP) మద్దతుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం (ఉత్తరాంధ్ర) పట్టభద్రుల నియోజకవర్గ (North Andhra Graduates MLC) శాసనమండలి అభ్యర్థిగా పోటీచేసిన ఆయన.. తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్లి సమీప ప్రత్యర్థి, వైకాపా (YCP) అభ్యర్థి అయిన సీతంరాజు సుధాకర్కు గట్టి షాకిచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. TSPSC paper leak: ఆ ఇద్దరే కాదు.. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు: కేటీఆర్
టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పష్టంచేశారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డే కాదు.. ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషన్లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. Vishwak Sen: ‘అర్జున్తో వివాదం.. డబ్బులు చెల్లించారా?’ విశ్వక్సేన్కు విలేకరి ప్రశ్న
నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఛానెల్కు విశ్వక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అర్జున్ సర్జా(Arjun)తో నెలకొన్న వివాదంపై స్పందించమని విలేకరి కోరగా ఆయన మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. ఆ విషయం గురించి తాను మాట్లాడాలనుకోవడం లేదని సమాధానమిచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. KL Rahul: కేఎల్ రాహుల్.. విమర్శల నుంచి ప్రశంసల వరకు..
ఫామ్లో లేడు.. జట్టులో దండగ.. అతడికి ఇంకా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు.. బీసీసీఐ బాగా వెనకేసుకొస్తోంది.. జట్టుకు భారంగా మారాడు.. కొత్తవారికి అవకాశం ఇస్తే బెటర్.. ఇవీ నిన్నటి వరకు టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్పై సోషల్ మీడియా వేదికగా వచ్చిన విమర్శలు. అయితే క్రికెట్ కెరీర్లో సహజమేనంటూ ఓర్పుగా భరించాడు. సమయం కోసం వేచి చూశాడు.. ఇప్పుడు రోహిత్, శ్రేయస్ గైర్హాజరీలో లభించిన ఛాన్స్ను సద్వినియోగిం చేసుకొంటూ బ్యాట్తో సత్తా చాటాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. India-China: చైనాతో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే..
వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారమైతే గానీ.. భారత్ (India), చైనా (China) మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాలేవని అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar). హిమాలయ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం.. ‘అసాధారణ, సవాళ్ల దశ’కు చేరుకుందని తెలిపారు. దిల్లీలో శనివారం జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. Donald Trump: ఫేస్బుక్, యూట్యూబ్లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ (Facebook), యూట్యూబ్లోకి (Youtube) రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ట్రంప్ ప్రముఖ సోషల్ మీడియాల్లోకి పునరాగమనం చేయడం ప్రాధాన్యం సతరించుకుంది. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ఆయన సోషల్ మీడియా ఖాతాలపై విధించిన నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ ఫేస్బుక్, యూట్యూబ్ వేదికలపై శుక్రవారం అభిమానులను పలకరించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. Fixed Deposit: కంపెనీ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ.. జాబితా ఇదే..
ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని పొందాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. మీరు కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించవచ్చు. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే.. కంపెనీ డిపాజిట్లు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. మార్కెట్ పెట్టుబడుల జోలికి వెళ్లని సాధారణ డిపాజిటర్లు, సీనియర్ సిటిజన్లు కూడా కంపెనీల ఎఫ్డీలలో మదుపు చేయడానికి యోచించవచ్చు. క్యుములేటివ్ కంపెనీ ఎఫ్డీలు పెట్టుబడిదారులకు ఎఫ్డీ కాలవ్యవధి ముగిసే సమయానికి అసలు, వడ్డీతో పాటు చెల్లిస్తాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా ఈ డిపాజిట్లను తీసుకోవచ్చు. ఈ డిపాజిట్లకు నామినీ సౌకర్యం కూడా ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. నియామకాల్లో జోక్యం చేసుకుంటే న్యాయవ్యవస్థను పట్టించుకునేదెవరు?: రిజిజు
న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటే మరి న్యాయవ్యవస్థను పట్టించుకునేది ఎవరు..? అని ప్రశ్నించారు. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు ఏమి చేయాలన్న దాని పై రాజ్యాంగ ‘లక్ష్మణరేఖ స్పష్టంగా’ పేర్కొందని తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. Putin: ఐసీసీ అరెస్ట్ వారెంట్.. పుతిన్పై ప్రభావమెంత?
రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin)కు అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్(Ukraine)లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాల(War Crimes)కు బాధ్యుడిగా పేర్కొంటూ ఈ మేరకు వారెంట్ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై సైనిక చర్య మొదలు ఈ నేరాలకు పాల్పడినట్లు పేర్కొంది. అయితే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. IND vs AUS: సిరీస్పై టీమ్ఇండియా కన్ను.. రెండో వన్డేకి రోహిత్ శర్మ!
ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో (IND vs AUS) టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ (75*), రవీంద్ర జడేజా (45*) భారత్ను గెలిపించారు. దీంతో వైజాగ్లో జరిగే రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో భారత అభిమానులకు శుభవార్త. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!