Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తితిదే ఆదాయం ప్రభుత్వానికి వెళ్లే ప్రసక్తే లేదు: ఈవో ధర్మారెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో 2,068 ఆలయాల నిర్మాణం చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలలో ఈ ఆలయాల నిర్మాణం జరుగుతోందని.. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. గవర్నర్ను ఎందుకు కలిశారు? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. ఎందుకు కలిశారని ఆ సంఘాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రేపట్నుంచే జేఈఈ మెయిన్ పరీక్ష.. విద్యార్థులూ ఇవి మరిచిపోకండి!
జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షకు వేళైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే ఈ పరీక్ష మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఏ(NTA) అధికారులు సర్వం సిద్ధంచేశారు. రేపటి నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సన్నద్ధమైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/నుంచి ఎప్పటికప్పుడు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ అధికారులు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సచిన్, కోహ్లీ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటావు? కమిన్స్ సమాధానమిదే
సచిన్ తెందూల్కర్ లేదా విరాట్ కోహ్లీ? వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న ప్రతి క్రికెట్ అభిమానికి ఒక్కసారైనా మెదిలే ఉంటుంది. సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)ని అభిమానులు 'గాడ్ ఆఫ్ క్రికెట్' అని పిలుస్తుండగా. విరాట్ కోహ్లీని ‘రన్ మెషీన్’ అని సంబోధిస్తుంటారు. సచిన్ నెలకొల్పిన రికార్డుల్లో కొన్నింటిని కోహ్లీ ఇప్పటికే బద్ధలు కొట్టగా.. మరికొన్ని రికార్డులను బ్రేక్ చేసే దిశగా సాగుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. తెలంగాణ వంటకాల్లో కాస్త ఘాటు ఎక్కువే: రాహుల్ ఆసక్తికర ఇంటర్వ్యూ
తెలంగాణ వంటకాల్లో కాస్త కారం ఎక్కువే అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ‘భారత్ జోడో యాత్ర’లో బిజీగా ఉన్న ఆయన.. మధ్యలో ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ ‘కర్లీ టేల్స్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన వ్యక్తిగతానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్న రాహుల్.. తన ఆహార అలవాట్లను బయటపెట్టారు. అలాగే తన పెళ్లి గురించి కూడా సరదాగా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అండమాన్ దీవులకు పరమ్ వీర్ చక్ర గ్రహీతల పేర్లు.. నామకరణం చేసిన ప్రధాని
ప్రధాని నరేంద్రమోదీ(Modi) సోమవారం అండమాన్ నికోబార్(Andaman and Nicobar)లోని 21 దీవులకు పేర్లు పెట్టారు. 21 మంది పరమ్వీర్ చక్ర(Param Vir Chakra) గ్రహీతల పేర్లు వీటికి పెట్టారు. పరాక్రమ్ దివస్ను పురస్కరించుకొని.. పేర్లు లేని వాటికి తాజాగా పేర్లు పెట్టారు. అలాగే నేతాజీ గౌరవార్థం ఒక జాతీయ స్మారకం నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఆస్ట్రేలియాలో ఇస్కాన్ మందిరంపై ఖలిస్థానీ రాతలు..!
ఆస్ట్రేలియా(Australia)లోని మరో ఇస్కాన్ మందిరంపై తాజాగా ఖలిస్థానీ మద్దతు నినాదాలు ప్రత్యక్షమయ్యాయి. నెల రోజుల వ్యవధిలో అక్కడి హిందూ దేవాలయాలపై ఇటువంటి ఘటన జరగడం ఇది మూడోసారి. ‘ఆస్ట్రేలియా టుడే’ పత్రిక కథనం ప్రకారం.. మెల్బోర్న్(Melbourne )లోని ఆల్బెర్ట్ పార్క్లోని ఇస్కాన్ ఆలయంపై కొందరు ‘ఖలిస్థాన్ జిందాబాద్’ అంటూ భారత విద్వేష నినాదాలు రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ‘జాబ్ లేదు.. వీసా టైం ఆగదు’: అమెరికాలో భారతీయులకు కొత్త సవాళ్లు..!
అమెజాన్లో పనిచేస్తున్న గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితమే అమెరికా (US)లో అడుగుపెట్టింది. ఇటీవల లేఆఫ్ల్లో భాగంగా మార్చి 20 ఆమె చివరి వర్కింగ్ డే అని చెప్పారు. హెచ్-1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లిన ఆమె.. ఇప్పుడు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. లేదంటే స్వదేశానికి తిరిగివెళ్లడం తప్ప మరో అవకాశం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఆ విషయంలో.. టీమ్ఇండియాను చూసి నేర్చుకోండి: పాక్కు కనేరియా సూచన
వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య జరగనుండటంతో ఈ ఫార్మాట్లో టీమ్ఇండియా (Team India) వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడే విధంగా షెడ్యూల్ని రూపొందించింది బీసీసీఐ. అందుకు తగ్గట్టుగానే ఈ సంవత్సరంలో భారత జట్టు శుభారంభం చేసింది. శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న భారత్.. కివీస్పై వన్డే సిరీస్నూ తన ఖాతాలో వేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ వగీర్..!
భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది. ఐఎన్ఎస్ వగీర్(INS Vagir)ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ పాల్గొన్నారు. ‘‘ఈ సబ్మెరైన్తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయి. దేశ ప్రయోజనాలను ఇది శత్రువుల నుంచి కాపాడుతుంది. అంతేకాదు.. సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుంది’’ అని నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి