Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. Telangana BJP: భాజపాకు 119 నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు: బండి సంజయ్
కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ భాజపా నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు తెలంగాణలో భాజపా భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై నేతలు చర్చించారు. భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. Rohit Sharma: వైస్ కెప్టెన్సీని తొలగించడం పెద్ద విషయం కాదు: రోహిత్ శర్మ
భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ని వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించడం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma)ను ఆసీస్తో మూడో టెస్టు ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. Samantha: షూటింగ్లో గాయపడ్డ సమంత.. వైరలవుతోన్న ఫొటో
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు నటన అంటే ఎంతో అభిమానం. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించింది. సినిమాల్లో సన్నివేశం బాగా రావడం కోసం ఆమె ఎంత కష్టపడడానికైనా సిద్ధపడుతుందని పలువురు స్టార్ హీరోలు ఆమెపై ప్రశంసలు కురిపించిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫొటో తన కష్టానికి నిదర్శనంగా నిలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. Kavita: దోషులను ప్రభుత్వం వదిలిపెట్టదు.. ప్రీతి కుటుంబానికి ఇదే నా హామీ: ఎమ్మెల్సీ కవిత
కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈమేరకు ప్రీతి తల్లిదండ్రులకు ఆమె లేఖ రాశారు. ‘‘ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నా. ఏ తల్లిదండ్రులకు రాకూడని పరిస్థితి ఇది. బాధిత కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం, భారాస అండగా ఉంటుందని కవిత లేఖలో పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. CM Jagan: 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా?: జగన్ సవాల్
ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం తమకు ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడికి 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా? అని ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు. తమది పేదల ప్రభుత్వమని.. చంద్రబాబుది పెత్తందారీ పార్టీ అని జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ‘వైఎస్సార్ రైతుభరోసా’ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. ప్రీతి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయండి: కాళోజీ వర్సిటీకి రాజ్భవన్ లేఖ
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి నేపథ్యంలో కాళోజీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాజ్భవన్ లేఖ రాసింది. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని పేర్కొంది. ర్యాగింగ్, వేధింపుల తరహా ఘటనలు జరిగినపుడు తీసుకునే చర్యలకు సంబంధించిన ఎస్ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని రాజ్భవన్ కోరింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. సాంకేతికతతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: మోదీ
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (Developed nation) భారత్ అవతరించేందుకు సాంకేతికత సాయపడనుందని ప్రధాని మోదీ (PM modi) అన్నారు. డిజిటల్ విప్లవం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ అనంతరం ‘సాంకేతికతతో జీవనం’ అనే అంశంపై నిర్వహించిన ఓ వెబినార్లో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. Joe Biden: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో జోబైడెన్: జిల్
అమెరికా(USA) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి 2024 ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారని అమెరికన్లు తెలుసుకోవాలని ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్(Jill Biden) వెల్లడించారు. తాను కూడా దానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నమీబియా, కెన్యా పర్యటనలు ముగించుకొన్న తర్వాత ఆమె ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ వయోభారం కారణాలతో 2024 ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగుతారనే ప్రచారాన్ని జిల్ కొట్టి పారేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. Elon Musk: మార్కెట్ ఎఫెక్ట్: ప్రపంచ కుబేరుడిగా మరోసారి ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్(Elon Musk) మరోసారి అగ్రస్థానానికి చేరారు. బ్లూమ్బెర్గ్ సూచీ ప్రకారం సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి మస్క్ (Elon Musk) ఆస్తుల విలువ సుమారు 187.1 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్(Bernard Arnault)ను వెనక్కి నెట్టేసినట్లైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. Sachin: సచిన్కు నిలువెత్తు విగ్రహం.. ఎంసీఏ కీలక ప్రకటన
టీమ్ఇండియా (Team India) క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం దక్కింది. భారత్లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్ (Sachin) నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు విగ్రహం ఏర్పాటుపై ముంబయి క్రికెట్ అసోషియేషన్ (MCA) అధ్యక్షుడు అమోల్ కాలే ప్రకటన విడుదల చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!