Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.
తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్ మిల్క్పై రూ.2లు పెంచారు. అలాగే, లీటరు హోల్ మిల్క్పైనా రూ.4ల చొప్పున పెంచుతున్నట్టు విజయ డెయిరీ ప్రకటించింది. పెంచిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.
2.ఏపీలో నేటి నుంచి అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్లు
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఆ మద్యాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు చెందిన రిటైల్ ఔట్లెట్లలో విక్రయించనున్నట్లు తెలిపింది. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలో ప్రీమియం బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయించింది.
New Year Celebrations : సందడిలేక వెలవెలబోతున్న బెజవాడ
3.న్యూఇయర్ వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పబ్లు, బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని తెలిపింది.
4.మళ్లీ మేమే వస్తాం.. నల్గొండ ఐటీ హబ్ని ప్రారంభిస్తాం: కేటీఆర్
ఏడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్ని ప్రారంభించి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నల్గొండలో ఐటీ హబ్కు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో భూమిపూజ చేశారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 75వేల చదరపు అడుగుల్లో 750మంది కూర్చొనేలా నిర్మించబోయే ఐటీ హబ్ ద్వారా 15 కంపెనీలు 1600 ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు.
5.సోము వీర్రాజు.. తెరపైకి మరో కొత్త డిమాండ్
గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. ఆ పేరు మార్చకపోతే తాము అధికారంలోకి వచ్చాక మారుస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ఆర్థర్ కాటన్తో పాటు ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన వీరన్న అనే ఇంజినీర్నూ స్మరించుకోవాలన్నారు.
TSRTC: ఆర్టీసీ నూతన సంవత్సర కానుక
విమాన ప్రయాణంలో ఉండగానే ఓ ప్రయాణికురాలికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ప్రయాణం మధ్యలోనే పాజిటివ్గా తేలడంతో విమానంలోని బాత్రూంలోనే కొన్ని గంటలపాటు ఐసోలేషన్లో ఉంచాల్సి రావడం గమనార్హం. డిసెంబర్ 19న అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
7.2021కి లాభాలతో వీడ్కోలు.. సూచీల్లో కొత్త ఏడాది జోష్!
దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు ఈ ఏడాదికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఈ రోజు ఆద్యంతం మార్కెట్లలో కొత్త సంవత్సరం జోష్ కనిపించింది. ఈ సంవత్సరం తరహాలోనే వచ్చే ఏడాది కూడా మార్కెట్లలో లాభాలు ఆర్జింజే అవకాశాలు మెండుగానే ఉంటాయన్న విశ్లేషణలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి.
8.టిబెట్ వద్దరోబో సైన్యాన్ని మోహరించిన చైనా..!
చైనా సైన్యం శారీరక దారుఢ్యంలో అనుకున్నంత పటిష్ఠంగా లేదని జరుగుతోన్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. తాజాగా ఇక్కడ సైనికులు వాతావరణానికి తట్టుకోలేకపోతుండటంతో రోబోలను బరిలోకి దించింది. ఈ విషయాన్ని పలు ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. డ్రోన్ల ద్వారా వేడివేడి ఆహారం పంపడం.. హీట్ ఛాంబర్ల చిత్రాలను ప్రచారం చేసుకోవడం ద్వారా తమ సైనికులు ఉన్న సౌకర్యాలను గొప్పగా చూపించుకొంది. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే.. వారు అక్కడి శీతల పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు.
9.పాక్.. రఫేల్ శక్తి తెలుసా..?
‘‘చైనా అత్యున్నత శ్రేణి స్టెల్త్ యుద్ధ విమానం జె-20.. భారత్కు చెందిన రఫేల్ యుద్ధవిమానంతో ఏమాత్రం పోటీపడలేదు. రఫేల్ రాకతో చైనా శిబిరంలో ఆందోళన నెలకొంది’’ ఫిబ్రవరిలో మీడియాతో మాట్లాడుతూ భారత వాయు సేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ వ్యాఖ్యల వెనుక బలమైన ఆధారాలున్నాయి. చైనా యుద్ధ విమానం జె-20ని.. అమెరికా ఎఫ్-22 రాఫ్టర్ టెక్నాలజీని దొంగిలించి తయారు చేశారు.
Gold Rates: పసిడి ధరకు రెక్కలు రానున్నాయా?
10.ఊపిరి పీల్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. రెండేళ్ల కర్ఫ్యూ ఎత్తివేత!
ఒమిక్రాన్ కలవరం కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో భారీ ఎత్తున కేసులతో ఒకవైపు ఫ్రాన్స్, యూకే, అమెరికా తదితర దేశాలు సతమతం అవుతుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంటోది! ఈ దేశంలో దాదాపు రెండేళ్లుగా కొనసాగిన రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను తాజాగా ఎత్తేయడం గమనార్హం. స్థానికంగా నాల్గో వేవ్.. గరిష్ఠ(పీక్) స్థాయిని దాటడమే ఇందుకు కారణమని స్థానిక అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!