Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
vvఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ఆన్లైన్లో దిశా నిర్దేశం.. సందేహాలను తీర్చే సైట్లు
నేర్చుకునే క్రమంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. ఇంజినీరింగ్, సైన్స్, కామర్స్, పాలిటీ, వైద్య విద్య, మేనేజ్మెంట్.. సబ్జెక్టు ఏదైనా సరే, చదివేటప్పుడు పూర్తిగా బోధపడదు. తరగతిలో అయితే వెంటనే అధ్యాపకులను అడిగి సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లో చదువుకునేప్పుడూ కొన్ని అనుమానాలు రావొచ్చు. వాటిని వెంటనే తీర్చుకోవడం వల్ల విషయం స్పష్టంగా అర్థమై సంబంధిత అంశంపై పట్టు సంపాదించడానికి వీలవుతుంది. ఇందుకు తోడ్పడే కొన్ని వెబ్సైట్ల వివరాలను క్లుప్తంగా తెలుసుకుందామా? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ధరణి దగాలో కొత్త కోణాలు?
తిమ్మిని బమ్మి చేయడంలో సిద్ధహస్తులమని నిరూపించారు. ఉన్నతాధికారులనే కంగుతినిపించారు. భూ మోసాల్లో కొత్త కోణాలను ఆవిష్కరించారు. కాసుల కక్కుర్తి కోసం ఉన్నతాధికారుల కళ్లుగప్పారు. జిల్లాలో సంచలనాన్ని రేకెత్తించిన ధరణి రికార్డులో పేరు మార్పిడి వ్యవహారంలో కొందరు అక్రమార్కుల తీరిది. రెవెన్యూ శాఖనే కంగు తినిపించేలా జరిగిన ఘోర తప్పిదాన్ని సరిదిద్దుకునే పనిలో ఉన్నతాధికారులున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Hyderabad: అదీమ్ వెనుక భారీ నెట్వర్క్.. అతడి ఫోన్లో 49,900మంది యువతుల చిత్రాలు
మహ్మద్ అదీమ్(31) అలియాస్ అర్నవ్, అభయ్, అర్నబ్, అర్నాఫ్, అరోరా, ఆశవ్, అతీఫ్, నిఖిల్.. సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో ప్రధాన నిందితుడి మారు పేర్లు ఇవి! భారీ నెట్వర్క్తో పెద్దఎత్తున వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న ఇతడు ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు దొరికాడు. దర్యాప్తులో భాగంగా ఇతని గురించి తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Video: ఇంగ్లీష్తో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ రిక్షా కార్మికుల ప్రతిభ
4. జగనన్న కాలనీ ఇళ్లకు బీటలు!
విజయవాడ నగర పాలక సంస్థ పరిధి గుబ్బలగుట్ట కొండ ప్రాంతంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల ప్రభావం జగనన్న కాలనీలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై పడింది. కొండ శిథిలాలను భారీ వాహనాల్లో లేఔట్లోని ఇళ్ల మధ్యగానే తరలిస్తుండటంతో వాహనాల రాకపోకల ధాటికి ఇళ్ల గోడలు దెబ్బతింటున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికే పలు ఇళ్ల గోడలకు బీటలు పడటంతో వారంతా ఏం చేయాలో తెలియక అధికారులకు తమ గోడు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Hyderabad: సిటీ బస్సులుగా ‘సూపర్ లగ్జరీ’లు
కిక్కిరిసిన బస్సుల్లో ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తున్న వారికి కాస్త ఊరటనిచ్చేలా టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది 300 ఎలక్ట్రిక్ బస్సులు సమకూరేలోపు అదనంగా 700 బస్సుల వరకూ సమకూర్చాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్తగా వచ్చిన వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సు తుక్కుగా మారాల్సిందే. 2023 నుంచి 300 సిటీ బస్సులు తుక్కుగా మారనున్నాయి. అందుకే అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు పిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. గృహప్రవేశానికి ధరల సెగ
నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు పథకానికి ఈ ఏడాది డిసెంబర్ 25తో రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 21న ప్రభుత్వం పెద్దఎత్తున సామూహిక గృహప్రవేశాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో భాగంగా జిల్లాలో తొమ్మిది వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే గడువు నాటికి జిల్లాలో లక్ష్యం మేర ఇళ్ల నిర్మాణాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Video: రష్యాలోని కుర్స్క్ విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి
7. మన మెట్ల బావులనూ బాగు చేద్దాం
రాజధాని నగరం సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో చెత్తతో నిండిన మెట్ల బావిని ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. రూ.10 కోట్లు కేటాయించి అందులోని 3900 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. మంత్రులు కేటీఆర్ దీన్ని సోమవారం ప్రారంభించారు. ఓరుగల్లు నగరంలోనూ ఇలాంటి మెట్ల బావులు అయిదు ఉన్నాయి. వీటినీ పర్యాటక ప్రాంతాలుగా మారిస్తే రాజధానిని మించి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఒకే ప్లాన్.. 184 దేశాల్లో సేవలు: ఎయిర్టెల్
కొవిడ్-19 పరిణామాల తర్వాత అంతర్జాతీయ పర్యటనలు పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘ఎయిర్టెల్ వరల్డ్ పాస్’ ప్లానును ప్రారంభించినట్లు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. ఒకే ప్లాన్తో 184 దేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను అందుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుత ఛార్జీలతో పోలిస్తే, ఈ దేశాల్లో రోమింగ్ ఛార్జీలను దాదాపు 99 శాతం తగ్గించినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Sridevi Drama Company: ఇంద్రజ స్టెప్పేస్తే... స్టేజంతా ఊగిపోవాల్సిందే మరి..!
9. బాలిక దత్తత కోసం.. ఇటలీ నుంచి గుంటూరుకు!
ఇటలీ దేశానికి చెందిన భార్యాభర్తలు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరులోని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు ఓ వాహనంలో వచ్చారు. నేరుగా బాలల పరిరక్షణ విభాగానికి వెళ్లి అక్కడున్న బాలికను ప్రేమతో ముద్దాడారు. ఆ బాలిక కూడా అదేవిధమైన అనురాగంతో వారిద్దరి ఒడిలోకి చేరింది. చూసే వారికి అక్కడ ఏం జరుగుతోందో కొద్దిసేపు అర్థం కాలేదు. ఎందుకంటే విదేశీయులు ఇక్కడి బాలికను ఆప్యాయంగా చూడటం ఆశ్చర్యానికి గురి చేసింది. తీరా విషయం తెలిశాక వారిని అభినందించారు. వివరాలివీ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. దరఖాస్తుకు రూ.వెయ్యి.. ఓటుకు రూ.10 వేలు!
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మూతపడిన విద్యాసంస్థల నుంచి దరఖాస్తుల రావడమే కాకుండా ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ చోటుచేసుకుంటున్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.1,000 చెల్లించగా, ఓటుకు రూ.10 వేలు ఇస్తామనే హామీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ రకంగా ఎన్నడూ లేనంతగా గురువుల ప్రతిష్ఠకు భంగం కలిగేవిధంగా చోటుచేసుకున్న పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్