Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.
1.ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలింది. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్లో బిపిన్ రావత్తో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
2.బిపిన్ రావత్.. చదివిన చోటే మృత్యు ఒడిలోకి..!
తమిళనాడులో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాద ఘటనలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే వీరిని సమీపంలోని వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అయితే, వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీస్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు బయలుదేరిన సమయంలోనే ప్రాణాలు కోల్పోవడాన్ని కాలేజీ సిబ్బంది, అధ్యాపకులు నమ్మలేకపోతున్నారు.
3.బిపిన్ రావత్.. 6 ఏళ్లనాటి ఘటనలో మృత్యువును జయించి..!
హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారన్న వార్త యావత్ దేశప్రజలను నిశ్చేష్టులను చేసింది. ఈ దుర్ఘటనలో జనరల్ బిపిన్ భార్య మధులికతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే, 2015లో ఇటువంటి హెలికాప్టర్ ప్రమాదమే బిపిన్ రావత్కు ఎదురయ్యింది.
4.బిపిన్ రావత్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
తమిళనాడులోని ఊటీ కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందడం బాధాకరమని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు రావత్ మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. ప్రమాదం నుంచి తీవ్రంగా గాయపడిన గ్రూప్ కప్టెన్ వరుణ్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
5.ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో చిత్తూరు జిల్లావాసి మృతి
తమిళనాడులోని ఊటీ కొండల్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి చెందారు. కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్గా విధులు నిర్వహిస్తున్నారు.
6.నాన్న బాటలో సైన్యంలో చేరి.. సీడీఎస్గా ఎదిగి!
తమిళనాడులోని కూనూరులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్కు సైన్యంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన భారత సైన్యం అత్యున్నత పదవిని నిర్వహించారు. పాఠశాల విద్య తర్వాత మరో ఆలోచన లేకుండా సైన్యంలో చేరి అంచలంచెలుగా ఎదిగి తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బాధ్యతలు చేపట్టారు.
7.హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు
దేశంలోని త్రివిధ దళాలకు సమన్వయకర్తగా వ్యవహరించే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీసీ) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న వాయుసేనకు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురవ్వడంతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు సహా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు.
8.హెలికాప్టర్ దుర్ఘటన .. మంటల్లో చిక్కుకొని ముగ్గురు కిందకు దూకారు!
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని షాక్కు గురిచేసింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనను తాను కళ్లారా చూసినట్టు కృష్ణస్వామి అనే వ్యక్తి తెలిపారు.
9.హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యుంజయుడితడే..!
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మంది కన్నుమూశారు. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు.
10.బిపిన్ రావత్.. వెల్లింగ్టన్లో లెక్చర్ ఇవ్వడానికి వెళ్లి..!
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు సీడీఎస్ సహా 13 మంది దుర్మరణం చెందారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. కాగా.. వెల్లింగ్టన్లో మిలిటరీ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం 9 గంటలకు దిల్లీలోని ప్రత్యేక విమానంలో వెళ్లిన రావత్.. కొద్ది గంటలకే ఈ ప్రమాదానికి గురవడం బాధాకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్