Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.
1.ఏపీలో కొత్తగా 14వేల కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,650 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నిన్న తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 3,969 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 83,610 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.
2.తెలంగాణలో కొత్తగా 3,603 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 93,397 నమూనాలను పరీక్షించగా 3,603 మందికి పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,33,815కి చేరింది. ఇవాళ 2,707 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రికవరీ రేటు 95.08శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
Health : ముందస్తు యవ్వనం ముంచుకురావడానికి కారణాలేంటి?
3.నిధులు కేటాయించండి.. కేంద్రానికి కేటీఆర్ మరో లేఖ
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశారు. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కు నిధులివ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పురపాలకశాఖ తరఫున చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు.
4.ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రధాని సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి నేతాజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నేతాజీ జయంతిని పురస్కరించుకొని ఏడాదిగా పరాక్రమ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ స్వాంతంత్ర్య పోరాటంలో ప్రాణాలొదిలిన అనేక మంది సైనికులకు ఈ విగ్రహం ప్రతిరూపంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
5.విగ్రహం సరే.. నేతాజీ మిస్టరీ సంగతేంటి?: కేంద్రాన్ని ప్రశ్నించిన దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజున తమ రాష్ట్ర శకటానికి అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించిన కేంద్రం.. అదే మహాత్ముడిపై తమ రాష్ట్రం రూపొందించిన శకటాన్ని తిరస్కరించి అన్యాయం చేసిందని మండిపడ్డారు. శకటాన్ని తిరస్కరించడానికి గల కారణాలనూ వెల్లడించలేదని తప్పుబట్టారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలో ఆదివారం ఆమె మాట్లాడారు.
6.వెనక్కి తగ్గేదేలే..పటిష్ఠంగా పీఆర్సీ ఉద్యమ కార్యాచరణ
పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. సామరస్య పూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని చేసిన ప్రయత్నాలు వికటించాయి. మరోవైపు విజయవాడ రెవెన్యూ భవన్లో సమావేశమైన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది.
AP news : హంసలదీవిలో వసతుల లేమి.. సందర్శకుల ఇబ్బందులు
7.ఎన్నికలున్నా.. అద్దె విమానాలను అడిగేవారే లేరు!
ఎన్నికలంటే రాష్ట్రాల్లో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు! ర్యాలీలు, బహిరంగ సభలు.. ఇలా హోరెత్తిపోతుంటుంది. కీలక నేతలు తమ ప్రసంగాలు, హామీలతో ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తుంటారు. ఈ క్రమంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు. ఒక్కోసారి ఒకేరోజు రెండు మూడు రాష్ట్రాల్లోని బహిరంగ సభలకు హాజరవ్వాల్సిన అవసరమూ ఉంటుంది. అందుకోసం ప్రత్యేక విమానాలను అద్దెకు తీసుకుంటుంటారు. దీంతో ఛార్టర్ ఫ్లైట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
8.రెండేళ్ల దాహం తీరిన వేళ.. సయ్యద్ మోదీ టోర్నీ ఫైనల్లో సింధు విజయం
సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. ఆదివారం లఖ్నవూలో జరిగిన ఫైనల్ పోరులో భారత్కే చెందిన యువ క్రీడాకారిణి మాళవిక బన్సోద్ను వరుస సెట్లలో ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆసాంతం దూకుడుగా ఆడిన సింధు మొదటి సెట్ను 21-13, రెండో సెట్ను 21-16తో గెలుపొంది. కేవలం 35 నిమిషాల్లోనే సింధు ఈ పోరును ముగించడం విశేషం.
9.ఆరోగ్య సంరక్షణకు కేటాయింపులు పెంచాలి.. ఫార్మా ఇండస్ట్రీ వినతులివే!
మన దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలోని డొల్లతనాన్ని కొవిడ్ మహమ్మారి బయటపెట్టింది. ముఖ్యంగా రెండో వేవ్ సమయంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత, ఐసీయూ పడకల కొరత ఈ రంగంలోని మౌలిక సదుపాయాలు మెరుగు పడాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. గతేడాది బడ్జెట్లో వ్యాక్సిన్లకు బడ్జెట్ కేటాయింపులు జరిపినప్పటికీ.. మొత్తంగా ఆరోగ్య రంగానికి పెంచింది అంతంత మాత్రమే. ఈ సారైనా జీడీపీలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని ఫార్మా ఇండస్ట్రీ కోరుతోంది.
10.‘అఖండ’లో రుద్ర సికందర్ అఘోరా... ఎలా సిద్ధమయ్యాడో చూశారా?
గతేడాది ఆఖరులో వచ్చి... టాలీవుడ్కి హిట్ ఫ్లేవర్ తీసుకొచ్చిన చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్గా వచ్చి భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ ‘అఖండ’ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. అఖండ రుద్ర సికందర్ అఘోరా పాత్రను బోయపాటి మలచిన తీరును అందులో చూపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!