Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉంది. ఏటా ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోదీ.. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. పీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం..
2. ఎయిర్టెల్ 5జీ ప్లాన్ ఇదే..!
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన 5జీ ప్లాన్ను ప్రకటించింది. ఆగస్టులోనే సేవలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాలకూ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విఠల్ తెలిపారు. అదే సమయంలో టారిఫ్ల పెంపునకు సంకేతాలు ఇచ్చారు.
3. ఆంబోతుల్లా తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోంది
హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఓ వెధవపని చేసి బహిరంగంగా ఎవ్వరం తిరగలేమన్న ఆయన.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.
4. బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం సాయంత్రం 4గంటలకు బిహార్ సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
5. ఆ 5రోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. తితిదే విజ్ఞప్తి
తిరుమల: ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని కోరుతోంది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు.
6. బిహార్లో రాజకీయ ఉత్కంఠ.. ఆసక్తికరంగా స్పీకర్ కొవిడ్ రిపోర్ట్..!
బిహార్లో భాజపా, జేడీయూ బంధానికి బీటలు వారిన నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..?
7. గోరంట్ల మాధవ్ను మేం రక్షించడం లేదు: హోం మంత్రి వనిత
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ వ్యవహారంలో రాజకీయ కుట్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాధవ్ వీడియో ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనలో ఉందని.. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు.
8. ‘అర్ష్దీప్ రూపంలో టీమ్ఇండియాకు అసలైన లెఫ్టార్మ్ బౌలర్ దొరికాడు’
యువ పేసర్ అర్ష్దీప్ రూపంలో టీమ్ఇండియాకు అసలుసిసలైన లెఫ్టార్మ్ పేసర్ దొరికాడని మాజీ వికెట్ కీపర్, ఛైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ కిరణ్ మోరే అభిప్రాయపడ్డారు. తాజాగా ఆసియాకప్ టోర్నీకి టీమ్ఇండియాను ఎంపిక చేసిన జట్టులో అర్ష్దీప్ను ఎంపిక చేసిన నేపథ్యంలో ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ పేసర్ జహీర్ఖాన్ తర్వాత టీమ్ఇండియాకు సరైన ఎడమచేతి వాటం బౌలర్ లేడనే విషయం తెలిసిందే.
9. రోజర్ ఫెదరర్.. ఐదేళ్ల కిందట హామీ.. తాజాగా నెరవేర్చి..
ఇవాళ ఇచ్చిన హామీని.. రెండు రోజులకో.. వారానికో మరిచిపోతుంటాం. అలాంటిది ఎప్పుడో ఐదేళ్ల కిందట ఓ చిన్నపిల్లవాడికి ఇచ్చిన ప్రామిస్ను నెరవేర్చాడు టెన్నిస్ అగ్రశ్రేణి ఆటగాడు రోజర్ ఫెదరర్. తాజాగా సర్ప్రైజ్ చేస్తూ తనతో ఆడాలనే యువకుడి కోరికను ఫెదరర్ తీర్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఓ ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి.
10. వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
పలు కారణాలతో కొందరు వాట్సాప్ గ్రూపుల్లో ఇరుక్కుపోతుంటారు. బయటకి వస్తే గ్రూప్ సభ్యులు ఏమనుకుంటారో అనే సందేహం. ఒకవేళ వెళ్లిపోతే ‘ఎందుకెళ్లిపోయావ్?’ అన్ని ప్రశ్నలు. దీంతో కక్కలేక మింగలేక ఆ గ్రూప్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసమే వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. గ్రూపుల్లోంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకునే సదుపాయం కల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
ప్రజల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. -
Nalgonda: ఎన్నికల కోడ్.. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. -
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన
భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) ప్రకటన విడుదల చేసింది. -
AP News: ‘ప్రజాగళం’ భద్రతా వైఫల్యంపై సీఈవోకి ఎన్డీయే నేతల ఫిర్యాదు
‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై ఏపీ ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు తెదేపా-జనసేన-భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. -
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
Hyderabad News: చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్లో వర్షం!
వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు. -
Tamilisai: రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) స్పందించారు. -
TS News: హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్రాజ్
లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. -
Jobs Alert: 5 నోటిఫికేషన్లు.. 25,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అలర్ట్. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Appsc: గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్
2018 నాటి ఏపీ గ్రూప్-1 నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేశాయి. -
MLC Kavitha: ‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’.. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అమెరికాలోని మిత్రులకు జీ5 గ్లోబల్ను రిఫర్ చేయండి.. రివార్డులు గెలుచుకోండి!(ADVT)
-
SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. -
టాప్ 10 న్యూస్ @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
AP News: ఈ నంబరు కాదు... ఆ నంబరు! వాలంటీర్ల మరో ఎత్తుగడ
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొందరు వాలంటీర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ‘వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించకూడదు. ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా ఉంచాలి. -
చుక్చుక్ బండి.. చర్లపల్లి సిద్ధమవుతోందండి
నగరానికి మణిహారంగా భావిస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిజాముల కాలం నుంచి ఆ మూడు స్టేషన్లేనా అనుకున్న నగరవాసులకు నాలుగోది చర్లపల్లి రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. -
ఎన్నికల వేళ.. సైబర్ వల
లోక్సభ ఎన్నికల వేళ సర్కారు పథకాల బూచి చూపిస్తూ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు
-
Hunger Crisis: క్షామం అంచున గాజా.. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో!
-
Lalu Prasad Yadav: రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?
-
Nalgonda: ఎన్నికల కోడ్.. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత