Top 10 News @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. నిస్సహాయులుగా మారాం: ఓ వైద్యురాలి భావోద్వేగం
కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తాము నిస్సహాయులుగా మారామని ముంబయికి చెందిన ఓ వైద్యురాలు డా.తృప్తిగిలాడి భావోద్వేగానికి గురయ్యారు. మాస్కు ధరించి జాగ్రత్తలు పాటిస్తేనే ఈ ఉపద్రవం నుంచి బయటపడతామని సూచించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలను కరోనా చట్టేసింది. ముఖ్యంగా ముంబయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* కరోనా ముప్పును తగ్గించే సాధనాలు ఇవే..
2. ఆక్సిజన్ లీకై సరఫరా నిలిచి 22మంది మృతి
మహారాష్ట్రలోని నాసిక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి బయట ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అవడంతో.. రోగులకు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. దీంతో 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్లోని జాకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ రోజు ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Double Mutantపై Covaxin భేష్!
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) నేడు ప్రకటించింది. సార్స్కోవ్-2, దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్ రకాన్ని కూడా అడ్డుకుంటోందని పేర్కొంది. విజయవంతంగా యూకే, బ్రెజిల్,దక్షిణాఫ్రికా రకం వైరస్లను బంధించి కల్చర్ చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. యూకే,బ్రెజిల్ వేరియంట్లను కొవాగ్జిన్ బలంగా నిలువరించినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* వ్యాక్సిన్ పాలసీ నోట్లరద్దు లాంటిదే..
5. తమిళనాడులో రూ.1000 కోట్ల కొకైన్ పట్టివేత
తమిళనాడులోని తూత్తుకుడిలో రూ.1000 కోట్ల విలువైన కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి వీవోసీ పోర్టుకు వచ్చిన ఓ నౌకలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నౌకలోని టింబర్ కిందిభాగంలో భారీ మొత్తంలో కొకైన్ను గుర్తించారు. బ్యాగుల్లో ఉన్న మొత్తం 400 కేజీల కొకైన్ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. తిప్పతీగ.. కరోనాకు దివ్యౌషధం!
తిప్పతీగ.. పల్లెల్లో ఎక్కువగా చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లూ ఈ తీగ గొప్పదనం ఎక్కువమందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ కరోనా పంజా విసుతురున్న వేళ కచ్చితంగా తెలుసుకొని తీరాలి. తిప్పతీగను అమృత, గుడూచి అని కూడా అంటారు. తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకులో విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలిసిఉండదు. కానీ ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో దీనిగురించి తెలుసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మహిళలకూ ఆర్థిక ప్రణాళిక ముఖ్యమే..
మహిళల్లో ఆర్థిక సాధికారికత అనేది సమానత్వానికి, జీవితాన్ని అర్ధవంతంగా రూపొందించుకునేందుకు మొదటి అడుగుగా చెప్పాలి. ఆర్థిక సాధికారిత ఉన్న మహిళలు తాము కోరుకున్న విధంగా జీవిస్తూ, తమ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేసే వారిగా ఉంటారు. మహిళలు తమ ఆర్థిక సాధికారితకు తప్పక తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Lockdown మళ్లీ పెడితే ఇబ్బందే: R.C.భార్గవ
8. Tech tips: మెయిళ్లు సురక్షితంగా...
నిత్యం మన ఇన్బాక్స్ని రకరకాల మెయిళ్లు ముంచెత్తుతుంటాయి. అనవసర మార్కెటింగ్ ఈమెయిళ్లూ చాలానే వస్తుంటాయి. అన్నీ సురక్షితమైనవి కాకపోవచ్చు! ఇవి మనల్ని ట్రాక్ చేస్తుండొచ్చు. మెయిల్లోని ఇమేజ్లు లేదా లింకుల్లో పిక్సల్ ట్రాకర్స్ దాగి ఉండొచ్చు! మెయిల్ని ఓపెన్ చెయ్యగానే పిక్సెల్లో ఉన్న కోడ్ మెయిల్ను ఎప్పుడు ఓపెన్ చేశారు? ఎక్కడ నుంచి ఓపెన్ చేశారు? లాంటి వివరాల్ని కంపెనీ సర్వర్లకి పంపే అవకాశం ఉంది. ఇందుకోసం డెస్క్టాప్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ వేరియంట్లలో సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దామా? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. తారల శుభాకాంక్షలు.. కొత్త పోస్టర్ల సందడి
శ్రీరామనవమిని పురస్కరించుకుని కొందరు సినీ తారలు శ్రీరాముడి గొప్పతనాన్ని తెలియజేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు తమ చిత్రాలకు సంబంధించిన కొత్త పోస్టర్లు పంచుకుంటూ విష్ చేశారు. వాటిపై ఓ లుక్కేయండి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* సామ్, నయన్.. ఫిదా చేస్తోన్న మేకప్ ఆర్టిస్ట్
10. ధోనీకి అదో సెంటిమెంట్: అందుకే అలా చెయ్యడు
టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఓ సెంటిమెంట్ ఉందని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా వెల్లడించాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్తో ముచ్చటించిన వేళ ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు. అందువల్లే మ్యాచ్లకు ముందు ధోనీ తన జట్టు ఆటగాళ్లకు గుడ్లక్ లేదా బెస్టాఫ్లక్ చెప్పడన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.