Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..
1. వారంలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్: మంత్రి హరీశ్రావు
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ను వారంలో విడుదల చేస్తామని.. నిరుద్యోగ యువత సిద్ధంగా ఉండాలని తెలంగాణ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డిలో పోలీసు శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. కేంద్రంలో 15లక్షలకు పైగా పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ఆయన నిలదీశారు.
‘అల్లరి ప్రియుడు’, ‘ఖైదీ’, ‘పుష్ప’.. కలసి ‘జెస్సీ’ వెంటపడితే!
2. నెల్లూరు ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారు: ధూళిపాళ్ల నరేంద్ర
నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో ఎస్పీ కల్పిత కథ బాగా అల్లారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 14 కేసుల్లోని నిందితులు కుక్కలు మొరిగితే భయపడతారా అని ప్రశ్నించారు. కోర్టులో వేల కేసులు ఉంటే కాకాణి కేసు ఆధారాలే కనిపించాయా అని నిలదీశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఉద్దేశపూర్వక చోరీ అని ధూళిపాళ్ల ఆరోపించారు.
3. ప్రజా స్పందన చూడలేకే మాపై తెరాస దాడులు: డీకే అరుణ
రాష్ట్రంలో తెరాస నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాసంగ్రామ యాత్ర సాగుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. భాజపా తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’లో ఇవాళ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
స్విమ్మింగ్లో నటుడు మాధవన్ తనయుడి సత్తా
4. పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు.. కస్టడీ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు
బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీ ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఈనెల 14న నిందితులు అభిషేక్, అనిల్ను చంచల్గూడ జైలు నుంచి తీసుకెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు వివిధ కోణాల్లో వారిని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన కస్టడీ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది.
5. ₹2.56 లక్షల కోట్ల సంపద ఆవిరి!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఫలితంగా మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.2.56 లక్షల కోట్లు తరిగిపోయి రూ.269.47 లక్షల కోట్లకు చేరింది.
తెరాస ప్లీనరీ.. ఏడు కమిటీలు ఏర్పాటు
6. 4 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!
మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI inflation) 14.55 శాతం వద్ద నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. చమురు, కమొడిటీ ధరలు పెరగడమే అందుకు కారణం. కూరగాయల ధరల్లో మాత్రం కాస్త ఒత్తిడి తగ్గింది. ఇలా టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదు కావడం ఇది వరుసగా 12వ నెల. క్రితం ఏడాది మార్చిలో ఇది 7.89 శాతంగా నమోదైంది.
7. రాష్ట్రాల ‘ఉచితాలు’ ఆందోళనకరమే: ఎస్బీఐ నివేదిక
భారత్లోని కొన్ని రాష్ట్రాలు ‘ఆర్థికంగా నిలకడలేని’ ఉచితాలు, ప్రజాకర్షక పథకాలు ప్రకటించడం ఆందోళనకర విషయమేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఒకటి వెల్లడించింది. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఎస్బీఐ రీసర్చ్ రిపోర్ట్లో పేర్కొంది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని నివేదిక తెలిపింది.
ఆమ్వే ఇండియాకు ఈడీ షాక్.. రూ.757కోట్ల ఆస్తులు అటాచ్
8. ట్విటర్కు ఎలాన్ మస్క్ ఆఫర్.. మౌనం వీడిన జాక్ డోర్సే
ప్రముఖ మైక్రోబ్లాకింగ్ సైట్ ట్విటర్ను 43 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ఆఫర్ ఇచ్చి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సంస్థ బోర్డును ఇరకాటంలో పెట్టారు. ఈ ఆఫర్పై ఎట్టకేలకు మౌనం వీడిన ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా కంపెనీ బోర్డుపై విమర్శలు చేశారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘‘ఇది (బోర్డు తీరును ఉద్దేశిస్తూ) నిరంతరం కంపెనీని దెబ్బతీస్తుంది’’ అని పేర్కొన్నారు.
9. రష్యా దాడి తర్వాత.. మేం ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాం..!
తమ మీద తమకు తప్ప.. ఈ ప్రపంచం మీద తమకు నమ్మకం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ పొరుగు దేశాలపై అస్సలు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశ భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేమని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.
10. నిరసనల సెగ.. రాజపక్స కుటుంబీకులు లేకుండా కొత్త కేబినెట్
కుటుంబ పాలనకు వ్యతిరేకంగా లంకేయులు చేస్తోన్న పోరుకు గొటబయ ప్రభుత్వం కాస్త దిగివచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త మంత్రులను నియమిస్తూ అధ్యక్షుడు గొటబయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. వీటిలో గొటబయ కుటుంబం నుంచి కేవలం ప్రధానమంత్రి మహింద తప్ప మరెవ్వరికీ చోటు కల్పించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్