Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. సభలోనే లేని భవాని.. స్పీకర్పై ఎలా దాడి చేస్తారు?
‘‘తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఈ నెల 20న అసలు శాసనసభకే రాలేదు. కానీ ఆమె కూడా స్పీకర్ తమ్మినేని సీతారాంపై దాడి చేసినట్లు ఈ నెల 21న ‘సాక్షి’ పత్రికలో ఫొటో ప్రచురించారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా?’’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ‘‘దీనికి బాధ్యులెవరు? జగన్మోహన్రెడ్డా? భారతిరెడ్డా?’’ అని ప్రశ్నించారు. ఎవర్ని మోకాళ్లపై కూర్చోబెట్టాలో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మొక్కుబడి తంతుగా ఇంటర్న్షిప్ వ్యవహారం
ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న డిగ్రీ ఇంటర్న్షిప్ మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థుల చదువుకు..వారి ఉపాధికి సంబంధం లేకుండా ఏదో ఒక దాంట్లో ఇంటర్న్షిప్ కేటాయించేస్తున్నారు. యువత ఆసక్తినీ పట్టించుకోవడం లేదు. విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. చిన్నచిన్న బేకరీలు, హోటళ్లు, బ్యూటీపార్లర్లు, ఎంబ్రైడరీ, కుట్టు, అల్లికలు, మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ఒకటేమిటి ఏది కనిపిస్తే దాంట్లో ఇంటర్న్షిప్కు పంపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పన్ను.. ఆదాయం.. వివరాలన్నీ యాప్లో
పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మొబైల్ యాప్ను తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్పేయర్’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే, యాప్స్టోర్లో అందుబాటులో ఉందని బుధవారం ఐటీ విభాగం తెలిపింది. దీన్ని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. ఈ మొబైల్ యాప్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్- ఏఐఎస్), పన్ను చెల్లింపుదారు సమాచారం (ట్యాక్స్పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ - టీఐఎస్) చూసుకునేందుకు వీలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. టాస్ గెలిచాక తుది జట్టు.. ఐపీఎల్లో నిబంధనల మార్పు
ఐపీఎల్ కెప్టెన్లు ఇక టాస్ పడ్డాక తుది జట్లను ప్రకటించవచ్చు. ఈ మేరకు నిబంధనల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కెప్టెన్లు టాస్కు ముందే తుది జట్టు వివరాలను ప్రకటించాలి. ‘‘రెండు జట్ల కెప్టెన్లు.. 11 మందితో కూడి తుది జట్టు, అయిదుగురు సబ్స్టిట్యూట్ల వివరాలను టాస్ తర్వాత లిఖిత పూర్వకంగా ఐపీఎల్ మ్యాచ్ రిఫరీకి అందించవచ్చు. ముందు తుది జట్టును వెల్లడించినా.. మ్యాచ్ ఆరంభానికి ముందు ప్రత్యర్థి కెప్టెన్ అనుమతి లేకుండా మార్పులు చేసుకోవచ్చు’’ అని బీసీసీఐ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కన్నీరే మిగిలింది.. ఆదుకోండి సారూ!
‘ముఖ్యమంత్రి సారూ! ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటి పాలైంది. వాన దేవుడి దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. మొక్కజొన్నంతా నేల వాలింది. రూ.లక్షలు పోసి సాగు చేసిన మిర్చి.. రాళ్ల దెబ్బలకు అక్కరకు రాకుండా పోయింది. వరి, కూరగాయలు అన్నీ ఆగమయ్యాయి. మునిగిన మా పంటల్ని చూసి కరుణించండి. మరోసారి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మా శ్రమకు తగ్గ పరిహారం ఇచ్చి ఆదుకోండి’ సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ముఖ్యమంత్రికి చేసుకుంటున్న వేడుకోలు ఇది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సైకిల్ తొక్కితే బరువు తగ్గొచ్చు..
ఈరోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగినా... వ్యాయామం చేయడంలో మహిళలు ఇప్పటికీ వెనకబడే ఉన్నారు. సమయాభావం, జిమ్కి వెళ్లలేకపోవడం వంటివెన్నో ఇందుకు కారణాలు... ఇలాంటప్పుడు సైక్లింగ్ని ఎంచుకుంటే మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయంటారు వ్యాయామ నిపుణులు. మరి దాని ప్రయోజనాలు చూద్దామా. వారంలో మూడుసార్లైనా సైకిల్ తొక్కి చూడండి. కొలెస్ట్రాల్, రక్తపోటు అదుపులో ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. పగలు వద్దు.. రాత్రి తవ్వుకోండి!
పక్క చిత్రంలోని పొలం చూశారు కదా! ఒక పక్క సాగు నీటి కాలువ, మరోపక్క డ్రైనేజీ ఉండేది. పంటలు పండే బంగారు భూములు. ఎంచక్కా రాత్రికి రాత్రే చేపల చెరువుగా మారిపోయింది. ఆక్వా జోన్, సీఆర్జడ్ లాంటి నిబంధనలు అవసరం లేదు. మత్స్యశాఖ నుంచి అనుమతులు అవసరం లేదు. రెవెన్యూ శాఖ నుంచి అనుమతి లేదు. కానీ రాత్రికి రాత్రే తవ్వేశారు. ఇక కాలువలకు నీరు విడుదల చేస్తే.. చెరువుల్లో నింపి ఆక్వా కల్చర్ సాగు చేయడమే.. రూ.లక్షల్లో లీజుకు ఇవ్వడమే..! కావాల్సిందల్లా అధికారి పార్టీ నేతల హామీ మాత్రమే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. విశాఖ ఉక్కుపై.. నష్టాల నెపమా?
ఏపీలో కేంద్ర ప్రభుత్వ రంగంలో నడుస్తోన్న అతిభారీ పరిశ్రమ విశాఖ ఉక్కు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కల్పవృక్షంలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికల్లోనూ ‘విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఉక్కు రంగంలో 2.1% మేర ఉత్పత్తి తగ్గింది’ అని పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఇది మినీ వ్యానా.. బస్సా!
పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు పరుగెడుతున్నాయి. ఏమాత్రం వాహనం అదుపు తప్పినా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు. వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో మినీ వ్యానులో ఎక్కిన ప్రయాణికులను గమనిస్తే ‘ఇంత మంది ఎలా సాధ్యం’ అనే అనుమానం కలగకమానదు. ప్రధాన రహదారిలో పెద్ద సంఖ్యలో పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు వెళుతున్నా అధికారుల తనిఖీలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇంటి పన్నులో చెత్త అనుసంధానం
కర్నూలు నగర వాసులపై భారం మోపేందుకు కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కచ్చితంగా చెత్త పన్ను వసూలు చేయాలన్న లక్ష్యంతో ఆస్తి పన్నులో అనుసంధానం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. నగర పరిధిలో 52 వార్డుల్లో ఆరు లక్షల జనాభా ఉంది. నిత్యం 181 టన్నుల చెత్త పోగవుతోంది. ఇంటింటి సేకరణ బాధ్యత ఏజెన్సీకి అప్పగించారు.. 91 ఆటోలు సమకూర్చారు. ప్రతి ఇంటికి మూడు ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు. తడి, పొడి, హానికారక వ్యర్థాలు అందులో వేసి ఉదయం వేళ వీధుల్లోకి వచ్చే ఆటోలకు ఇవ్వాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా
వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదులను వైకాపా ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయం తెలుసుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి కూల్చివేతను అడ్డుకున్నారు. -
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. -
ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఏఎస్సై ఆలింగనం.. సస్పెండ్ చేసిన సీపీ
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. -
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. -
కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోరు నుంచి మంటలు వచ్చాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ టెన్త్ ఫలితాలు.. రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి
ఏపీ పదో తరగతి ఫలితాల్లో (AP SSC Results) 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) విడుదలయ్యాయి. -
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. -
తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ముడాపై మురిసిన తోడేళ్లు..!
మట్టి, ఇసుక, బుసక పేరిట వైకాపా శ్రేణులు దోపిడీకి పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు ఉండవు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోర్టు అవసరాల కోసం తెదేపా ప్రభుత్వం రైతుల భూములను కొనుగోలు చేస్తే... -
‘నమాజు సమయంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి’
ఎన్నికల్లో మతపరమైన అంశాలతో ప్రచారం చేయకూడదనే కఠిన నిబంధనలున్నా.. వైకాపా నేతలకు మాత్రం వర్తించడం లేదు. విచ్చలవిడిగా మతపరమైన అంశాలను జోడించి ప్రచారం చేస్తున్నారు. -
కమిటీల పేరుతో కాలయాపన
ప్రతి అయిదేళ్లకు ఒక సారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఒకవేళ ఇది ఆలస్యమైతే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తుంది. -
జగనన్న.. గూడు పుఠాణి
అన్నింట్లో అధినేతనే అనుసరించే కొందరు ప్రజాప్రతినిధులు జగనన్న కాలనీలకు భూసేకరణలోనూ చేతివాటం ప్రదర్శించారు. పేదలు నివాసం ఉండే ఇళ్లకు లోతట్టు ప్రాంతాల్లో భూములు సేకరించారు. వాటి మెరక పేరిట మట్టి మెక్కేసి వదిలేశారు. -
నాడు ‘అన్న’దానం... నేడు అధ్వానం
తెదేపా హయాంలో నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
Kolkata vs Bengaluru: టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
అదరగొట్టిన జియో.. నికర లాభం ₹5,337 కోట్లు
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
-
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్