టాప్ 10 న్యూస్ @ 9 AM
భారత్- చైనా మధ్య తాజా ఘర్షణలకు కేంద్ర బిందువు పాంగాంగ్ సరస్సు ప్రాంతం. ఇక్కడి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) విస్తృతిపై రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా వివాదం ఉంది..
1. సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..
భారత్- చైనా మధ్య తాజా ఘర్షణలకు కేంద్ర బిందువు పాంగాంగ్ సరస్సు ప్రాంతం. ఇక్కడి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) విస్తృతిపై రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా వివాదం ఉంది. ఈ ఏడాది మే నెల నుంచి ఇక్కడ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఉత్తర తీరంలోని ఫింగర్స్ ప్రాంతంపైనే వివాదం ఉండగా.. ఇప్పుడు దక్షిణ తీరానికీ రగడ విస్తరించింది. వంచనతో పాంగాంగ్ ఉత్తర రేవులో పాగావేసిన చైనా సైన్యం గత నెల 29న అర్ధరాత్రి వేళ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక పర్వత శిఖరాలను కబ్జా చేసేందుకు ముందుకు కదిలింది. డ్రాగన్ ఉద్దేశాలను పసిగట్టిన భారత్ సైన్యం తానే ముందుగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* శత్రువు కంటికి చిక్కకుండా సరిహద్దుకు
2. పెళ్లి కావడం లేదని.. 2,331 మంది బలవన్మరణం
దేశంలో ఆత్మహత్యల పరంగా 2019 కొత్త రికార్డు నమోదు చేసింది. గత 11 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా 1,39,123 మంది గత ఏడాది బలవన్మరణానికి పాల్పడ్డారు. జాతీయ నేర గణాంకాల మండలి (ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. పేదలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్సీఆర్బీ తెలిపింది. ఈ జాబితాలో ఏడాదికి రూ.లక్షలోపు ఆదాయం ఉన్న నిరుపేదలు 66.2 శాతం(92,083), లక్ష నుంచి రూ.5 లక్షలలోపు ఆదాయమున్న వారు మరో 29.6 శాతం(41,197) ఉన్నారు. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో రూ.5 లక్షలలోపు ఆదాయమున్న పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలే 95.8 శాతం ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రక్షకులే దండిస్తే..!
పోలీసంటే ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పించాలి. బాధితులకు అండగా నిలవాలి. కానీ రాష్ట్రంలోని కొంతమంది వ్యవహారశైలి పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంది. అటువంటివారి వేధింపులు భరించలేక కొందరు బాధితులు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది దళితులే ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని సందర్భాలలో బాధ్యులపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. సామాన్యులపై కొంతమంది పోలీసుల జులుం మాత్రం తగ్గట్లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. హైదరాబాద్ మెట్రో పరుగులు ప్రారంభం
5. భిన్నంగా.. భద్రంగా..
కట్టుదిట్టమైన కరోనా నిబంధనల మధ్య తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. దాదాపు అయిదున్నర నెలల తర్వాత జరిగే ఈ సమావేశాల్లో పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. సమావేశాలకు అధికార, విపక్షాలు వ్యూహప్రతివ్యూహాలతో సన్నద్ధమయ్యాయి. కొవిడ్ ప్రభావం నేపథ్యంలో పార్లమెంటు మార్గదర్శకాల మేరకు సభ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఈసారి పండగలకు ప్రయాణాల్లేవ్!
దసరా, దీపావళి.. ఈ రెండూ అక్టోబరు-నవంబరు మధ్య వచ్చే అతిపెద్ద పండగలు. మన దేశంలో ప్రయాణాలు అత్యధిక ప్రయాణాలూ ఈ సమయంలోనే జరుగుతాయి. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా విమానయానంతో పాటు అన్ని ప్రయాణ పరిశ్రమల్లో పెద్దగా జోరు కనిపించకపోవచ్చని ఓ సర్వే అంటోంది. భారత్లోని 239 జిల్లాల్లో 25,000 మందిపై ఈ సర్వే జరిగింది. రాబోయే పండగ సీజన్లో ప్రయాణాల విషయంలో ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోవాలని ‘లోకల్ సర్కిల్స్’ అనే ఆన్లైన్ ప్లాట్ఫాం నిర్వహించిన ఈ సర్వేలో ఏం తేలిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. పెట్రోల్ బంకుల్లో మోసాలకు అతడే సూత్రధారి
పెట్రోల్బంకుల్లో మోసపూరితంగా చిప్లు అమర్చి వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న ముఠా సూత్రధారి శిబు థామస్ చాన్నాళ్లుగా యథేచ్ఛగా ఇదే దందా సాగిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలు పెట్రోల్బంకులకు ఏళ్ల తరబడి అతడు ఆ చిప్లను సరఫరా చేస్తుండటం గమనార్హం. తాజా మోసంలో ముంబయి నుంచి చిప్లు విక్రయించింది ఇతడే అని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే మోసానికి పాల్పడి అతడు 2014లో ఎస్వోటీ బృందానికి చిక్కాడు. తర్వాత ఆ వ్యవహారం మరుగున పడిపోవడంతో మళ్లీ ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆరోగ్యానికో గుర్తింపు
దేశంలోని ప్రజలందరినీ ఆరోగ్య సేవల పరిధిలోకి తీసుకువచ్చేందుకు జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య సమాచార నిర్వహణ ముసాయిదాను ప్రకటించింది. ఈ మిషన్లో భాగంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య గుర్తింపు సంఖ్యను జారీ చేసేందుకు వ్యక్తిగత వివరాలను తీసుకోవడంతో పాటు వాటి భద్రత, గోప్యతను పాటించనుంది. ఈ విధానంపై ఇప్పటికే ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. జాతీయ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ (ఎన్డీహెచ్ఎస్) కింద డేటాను కేంద్ర, రాష్ట్ర, స్థానికంగా మూడు దశల్లో నిక్షిప్తం చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* విటమిన్-డి లోపంతో... కరోనా ముప్పు అధికం
9. తొలి మ్యాచ్లో చెన్నై x ముంబయి
ఎట్టకేలకు ఐపీఎల్ 2020 షెడ్యూలు విడుదలైంది. యూఏఈ జరగనున్న ఈ టోర్నీ లీగ్ దశ మ్యాచ్లను వివరాలను బీసీసీఐ ఆదివారం వెల్లడించింది. తొలి మ్యాచ్లో ఈ నెల 19న అబుదాబిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. రన్నరప్ చెన్నై సూపర్కింగ్స్ను ఢీకొంటుంది. తర్వాతి రోజు దిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు దుబాయ్లో తలపడతాయి. సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ను ఈ నెల 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. తెలుగులోనే మాట్లాడమని చెబుతుంటా
‘‘ఒక మంచి దర్శకుడు, నటుడితో కలిసి పనిచేస్తున్నప్పుడు... ఎంత పెద్ద సవాల్ ఎదురైనా సులభంగా అధిగమిస్తాం’’ అంటున్నారు అదితిరావు హైదరీ. ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ తర్వాత ఆమె తెలుగులో చేసిన మరో చిత్రం ‘వి’. నాని, సుధీర్బాబు ప్రధాన పాత్రధారులుగా... మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ సందర్భంగా కథానాయిక అదితిరావు వెబినార్లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!