Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఐఫోన్ 13 వచ్చేసింది
యాపిల్ సరికొత్త 5జీ ఐఫోన్ 13 సిరీస్ను ఆవిష్కరించింది. కొత్తగా గులాబీ రంగులోనూ వీటిని తీసుకొచ్చింది. కెమేరా లెన్స్లను ఐ మూలగా ఏర్పాటు చేసి ఫోన్ వెనక భాగానికి కొత్త రూపు తెచ్చింది. ఫేస్ ఐడీ సెన్సర్లను తక్కువ స్థలంలో అమర్చింది. ఫోన్ కెమేరాలో కొత్తగా సినిమాటిక్ మోడ్ ఉంది. డాల్బీ విజన్ హెచ్డీఆర్లో షూట్ చేయవచ్చు. మ్యాగ్సేఫ్ ఛార్జింగ్నూ ఇవి సపోర్ట్ చేస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. JEE Main 2021 Results: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జేఈఈ మెయిన్ (నాలుగో విడత) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకులను జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు హవా కొనసాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* తప్పు చేశా... బాధపడుతున్నా...
3. బియ్యం కార్డుల వడపోత
బియ్యం కార్డుల వడపోత దిశగా పౌరసరఫరాల శాఖ... చర్యలు ముమ్మరం చేసింది. ఇటీవలి వరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రేషన్ తీసుకుంటున్న వారిపై దృష్టి పెట్టిన అధికారులు... ఇప్పుడు బోగస్ కార్డుల ఏరివేత చేపట్టారు. వరసగా మూడు నెలలకుపైగా రేషన్ తీసుకోని కార్డుల సంగతేంటో తేల్చాలని మండలాలకు జాబితాలను పంపారు. గ్రామాల వారీగా వీటి పరిశీలన మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Supreme Court: దంపతులిద్దరూ విషం తాగితే భర్తను శిక్షించడం తగదు: సుప్రీంకోర్టు తీర్పు
దంపతులిద్దరూ విషం తాగిన సందర్భంలో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ భర్తకు శిక్ష విధించడం సరికాదని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించారని భావించి శిక్ష వేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* విదేశాల చేతికి దేశ రక్షణ రహస్యాలు?
5. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్?
పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై శుక్రవారం జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘పెట్రో’పై భారీగా వసూలు చేస్తున్న పన్ను ఆదాయంలో కొంత కోల్పోవడానికి సుముఖత చూపితేనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావొచ్చు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వినియోగదార్లకు భారీగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఐసీయూలో చేర్చాలి.. అంతా దోచాలి
రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అధిక బిల్లులతో రోగులను బెంబేలెత్తిస్తున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా లేకపోయినా.. నిలువుదోపిడీ చేస్తున్నాయి. ప్లేట్లెట్లు లక్షలో ఉన్నా ఐసీయూలో చేర్పిస్తూ.. అవసరం లేకపోయినా వాటిని ఎక్కిస్తూ.. రూ.లక్షలు దండుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుడి శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. వైర్లెస్ విద్యుత్తు
వీధుల్లో విద్యుత్ స్తంభాలు, తీగలేవీ లేవు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద కేబుల్ టవర్లేవీ లేవు. అయినా ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగులీనుతూనే ఉన్నాయి. ఫ్రిజ్, ఏసీ వంటివి యథావిధిగా పనిచేస్తూనే ఉన్నాయి. ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. మరి అదే నిజమైతే? వైర్లెస్ విద్యుత్తు పంపిణీ పరిజ్ఞానంతో ఇది సాకారమయ్యే రోజులు మరెంతో దూరంలో లేవు. తీగలు లేని విద్యుత్తు అనగానే సైన్స్ ఫిక్షన్ కథ గుర్తుకురావొచ్చు. కానీ ఇదేమీ కాల్పనిక కథ కాదు. ఇది సాధ్యమేనని నిరూపితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* భూ లయ 2.75 కోట్ల ఏళ్లకోసారి!
8. IPL 2021: అప్పుడు హిట్ బౌలర్.. ఇప్పుడు నెట్ బౌలర్!
షెల్డన్ కాట్రెల్.. పంజాబ్ కింగ్స్ గతేడాది ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.8.5 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకున్న వెస్టిండీస్ ఫాస్ట్బౌలర్. అయితే అనుకున్నంతగా రాణించలేకపోవడంతో కాట్రెల్ను ఈసారి ఫ్రాంఛైజీ వదులుకుంది. వేలంలో అతడిని కొనేందుకు ఏ జట్టూ ముందుకు రాలేదు. టీ20 ప్రపంచకప్లో ఆడే విండీస్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగాగా ఎంపికైన ఈ పేసర్.. ఈనెల 19న యూఏఈలో ఆరంభం కాబోతున్న ఐపీఎల్ రెండో దశ టోర్నీలో నెట్ బౌలర్గా సేవలందించనున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నడవలేనోడు తిరగబడ్డాడా?
సరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న నా భర్త పోలీసులపై ఎలా తిరగబడతాడు..? అని చటాన్పల్లి ఎన్కౌంటర్ మృతుడు చెన్నకేశవులు భార్య ప్రశ్నించారు. త్రిసభ్య కమిషన్ విచారణలో భాగంగా మంగళవారం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. ‘దిశ’ హత్య కేసులో తన భర్తను పోలీసులు పట్టుకెళ్లిన తర్వాత జైలులో పలుమార్లు కిందపడిపోయాడన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి
అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు