టాప్ 10 న్యూస్ @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. బుజ్జగించడానికి బుగ్గన... నమ్మించడానికి నాని: రఘురామ
పీఆర్సీపై ఉద్యోగులను బుజ్జగించడానికి బుగ్గన, నమ్మించడానికి నాని, సర్దిచెప్పడానికి సమీర్శర్మ, సర్దుకోమనడానికి సజ్జల, బెదిరించడానికి బొత్సతో కమిటీ వేశారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శనివారం దిల్లీలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ... రెండు నెలలు జీతాలు ఇవ్వకపోతే వారే దారికి వస్తారని ఉద్యోగులను అవమానించేలా కొందరు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ... రెండు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడుతుందని, దాంతో కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మార్చి నెలాఖరు నుంచేఐపీఎల్-15
ప్రపంచ క్రికెటాభిమానుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్.. ఇంకో రెండు నెలల్లోనే మళ్లీ అభిమానుల్ని అలరించబోతోంది. ఐపీఎల్ 15వ సీజన్ను కాస్త ముందుగానే, మార్చి నెలాఖర్లో మొదలుపెట్టడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించాడు కూడా. ఫ్రాంఛైజీలన్నీ లీగ్ భారత్లోనే జరగాలని కోరుకుంటున్నాయని, అందుకోసం తాము చేయాల్సిందల్లా చేస్తామని, కానీ కొవిడ్ అదుపులోకి రాని పక్షంలో లీగ్ను మరోసారి విదేశానికి తరలించక తప్పదని షా సంకేతాలిచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మనోళ్లు.. విశ్వగురువులు
మనదేశానికి చెందిన అనేక మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విషయం తెలిసిందే. అలాగే పలు బహుళజాతి సంస్థల నిర్వహణలోనూ మనవారు కీలకస్థానాల్లో ఉన్న సంగతీ విదితమే. మరి దేశానికే చెందిన అనేక మంది ప్రవాసులు పలు దేశాల్లో పెద్దఎత్తున ఆచార్యులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలుసా?..ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి పలు దేశాలు ప్రవాసభారతీయులు/ప్రవాసాంధ్రులకు ఆచార్యులుగా పట్టం కడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మహాత్ముడికి ఇష్టమైన కీర్తన తొలగింపు
గణతంత్ర వేడుకల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 29న ఏర్పాటు చేసే ‘బీటింగ్ రిట్రీట్’ కార్యక్రమంలో మహాత్మా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ కీర్తన ‘అబైడ్ విత్ మీ’ని తొలగించారు. ఏటా ఈ గేయంతోనే వేడుక ముగిసేది. ఈసారి మాత్రం ‘సారే జహా సే అచ్చా’తో కార్యక్రమం సమాప్తమవుతుంది. ‘అబైడ్ విత్ మీ’ని స్కాటిష్ ఆంగ్లికన్ కవి హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ 1847లో రచించారు. 1950 నుంచి ఈ కీర్తన బీటింగ్ రిట్రీట్లో భాగంగా ఉంటోంది. దీన్ని తొలగించడంపై కాంగ్రెస్ మండిపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మురిపిస్తూనే... ముంచేస్తున్నాయి!
మీకు పొడుపుకథలు ఇష్టమేనా..? అయితే ఇది చెప్పగలరేమో చూడండి.వంటింట్లో ఉంటాయి...డ్రెసింగ్ టేబుల్ మీద ఉంటాయి.హాల్లో ఉంటాయి...బయటినుంచి తెప్పించుకున్న పిజ్జా బాక్స్లో ఉంటాయి. గుడ్డులో ఉంటాయి... కూరగాయల్లో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనచుట్టూ ఉంటాయి... మనలోనూ ఉంటాయి. ఏమిటో చెప్పండి చూద్దాం... తెలియలేదా, సరే... అవే... ‘ఫరెవర్ కెమికల్స్’ అనే విష రసాయనాలు..! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. విగ్రహం ఒక్కటే చాలదు మత నిగ్రహమూ కావాలి
ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ స్వాగతించారు. కేవలం విగ్రహం పెడితే సరిపోదని, నేతాజీ సిద్ధాంతాల్ని మనసా వాచా కర్మణా పాటించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని నొక్కిచెప్పారు. సర్వ మతాలను కలుపుకొనిపోయే సమ్మిళిత భావజాలాన్ని కేంద్రం, ప్రధానమంత్రి అనుసరించాలని సూచించారు. సామాజిక సమభావన సూత్రాన్ని నేతాజీ జీవితాంతం అనుసరించారని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* British Rule: మాట తప్పి... గేట్ ఇచ్చారు!
7. ఆహా ఏమి రుచి.. అనండి మైమరచి
తినే తిండి ఏదైనా దాన్ని ఆస్వాదించాలి. తినేటప్పుడు ఆ ఆహార పదార్థాలు ఎంత రుచికరంగా ఉన్నాయో తెలియజెప్పేలా ముఖ కవళికలను ప్రదర్శించాలి. నోట్లో ముద్ద పెట్టుకోగానే.. ‘వావ్.. చాలా బాగుంది’ అన్నట్లుగా ముఖంలో భావాన్ని పలికించాలి. అప్పుడే పిల్లలూ పెద్దలను అనుసరిస్తారు. ఆరోగ్యకరమైన పదార్థాలను చిన్నారులకు అలవాటు చేయడంలో పెద్దలు ఈ తరహా ధోరణిని అవలంబించాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఇంటింటా జ్వరం.. జలుబు
రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంది. ఒమిక్రాన్ బయటపడిన అనంతరం నెలరోజులుగా ప్రతి ఇంట్లో ఇవి సర్వసాధారణమయ్యాయి. రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జ్వర సర్వేలో వెలుగుచూస్తున్న వాస్తవాలివి. 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం తదితర లక్షణాలున్న వారు 1,28,079మంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అందరి నోళ్లలో నానుతున్న డోలో 650
‘డోలో 650’.. కొవిడ్ మహమ్మారితో ప్రజలందరి నోళ్లలో నానుతున్న మందు ఇదే. ఇంతకీ ఏమిటీ మందు.. దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం? దీన్ని ఉత్పత్తి చేస్తున్నది ఎవరు? అనేవి అత్యంత ఆసక్తికరమైన అంశాలుగా మారాయి. ‘డోలో 650’ అనేది బ్రాండు పేరు. మందు పారాసెట్మాల్. 650 ఎంజీ అనేది డోసు. బెంగుళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. వాస్తవానికి ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలందరికీ తెలిసిన పారాసెట్మాల్ బ్రాండ్లు వేరే ఉన్నాయి. అవి బహుళ జాతి ఫార్మా కంపెనీ జీఎస్కేకు చెందిన కాల్పాల్, క్రోసిన్ బ్రాండ్లు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఓ చిట్కా..సెలబ్రిటీల్ని చేసింది!
యూట్యూబ్ అంటే యువతకే అన్న నిర్వచనం మార్చారు వీళ్లు. వాళ్లతో పోటీ పడుతూ తక్కువ వ్యవధిలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమందికి బంధువులయ్యారు. అంత వరకూ ఇల్లే ప్రపంచంగా ఉన్న ఈ గృహిణులు తమ సెకండ్ ఇన్నింగ్స్లో సెలబ్రిటీలై పోయారు.. కనకదుర్గ, విజయలక్ష్మి. ఇలా చెబితే ఎవరబ్బా అనుకోవచ్చేమో. పెరవలి సిస్టర్స్ అనండి ఠక్కున గుర్తుపట్టేస్తారు. వసుంధర పలకరించగా.. తమ ప్రయాణాన్ని పంచుకున్నారిలా! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Shruti Haasan: మేం సరదాగా చెప్పుకొన్నాం.. అంతే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
-
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
-
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!