Top Ten News @ 9 PM
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..
1. జిల్లాల పేరు మార్చేందుకు నోటిఫికేషన్ వచ్చేసింది
వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మార్పుపై అభ్యంతరాలు, వినతులకు నెల గడువు విధించింది. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి.
సొంతింటి పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
2. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి
విదేశాలకు వెళ్లేందుకు రెండు వారాలు అనుమతివ్వాలని కోరుతూ జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోరారు. అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. విజయసాయి పిటిషన్పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.
3. Raghurama: అనర్హతకూ ఓ ప్రక్రియ: ఓం బిర్లా
ఎంపీ రఘురామ కృష్ణరాజు అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోకుండా ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకునేందుకు ఓ ప్రక్రియ ఉంటుందన్నారు. ముందుగానే ఇరుపక్షాలతో చర్చిస్తామని, వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తేల్చి చెప్పారు
4. koushik reddy: బాధతో రాజీనామా చేస్తున్నా!
చాలా బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి అన్నారు. హుజురాబాద్ టికెట్ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించడంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.
కౌశిక్.. స్థాయి తెలుసుకొని మాట్లాడు: ఉత్తమ్!
5. NEET: నీట్ (యూజీ)-2021 కొత్త తేదీ ఇదే..
నీట్ (యూజీ) 2021 పరీక్ష తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను తొలుత ఆగస్టు 1 నిర్వహిస్తామని ప్రకటించిన కేంద్రం ఆ షెడ్యూల్లో మళ్లీ మార్పులు చేసింది. తాజాగా, సెప్టెంబర్ 12న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం సాయంత్రం ప్రకటించారు.
6. జనాభా తగ్గాలంటే అదొక్కటే సరిపోదు: నీతీశ్
జనాభా నియంత్రణకు యూపీ ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ముసాయిదాపై బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం చట్టాలు చేయడం ద్వారా మాత్రమే జనాభా నియంత్రణ లక్ష్యాన్ని సాధించలేమన్నారు. చట్టాలు చేసినంత మాత్రాన జనాభా నియంత్రణ సాధ్యం కాదనేది తన స్పష్టమైన అభిప్రాయమని తెలిపారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై ప్రతి రాష్ట్రానికీ స్వతంత్రత ఉంటుందన్నారు.
ఆమీర్పై భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Maharastra: నాపై నిఘా.. కాంగ్రెస్ చీఫ్ ఆరోపణ
7. ‘డర్టీ పాలిటిక్స్ ఇక చాలు.. గోవా మార్పు కోరుతోంది’
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దృష్టిసారించారు. ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్లలో పర్యటించిన ఆయన.. మంగళవారం గోవా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ‘గోవా మార్పు కోరుతోంది.. చెత్త రాజకీయాలు చాలు’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు. గోవా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
8. ఆ మహిళా కానిస్టేబుల్.. ముంబయి థెరిసా!
పోలీసులంటే కఠినాత్ములని, కనికరం.. మానవత్వం ఉండదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. వృత్తిపరంగా వారు అలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. కానీ, వారిలోనూ ఎంతో మంది మానవత్వాన్ని చాటుకునే పోలీసులున్నారు. అలాంటి పోలీసే రెహనా షేక్ బాగ్వాన్. ముంబయిలో కానిస్టేబుల్గా చాలిచాలని జీతం అందుకునే రెహనా ఏకంగా 50 మంది పేద విద్యార్థులను దత్తతకు తీసుకుంది. అనేక రకాల సమాజ సేవల చేస్తూ ముంబయి మదర్ థెరిసాగా గుర్తింపు పొందుతోంది.
Sirisha: కల నిజమైన వేళ.. నమ్మలేకపోయా..
9. MAA Election: అలాగైతే ఎన్నికల నుంచి తప్పుకొంటా!
‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు ఏకగ్రీవం చేయాలని సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. తాజాగా ‘మా’ అధ్యక్ష ఎన్నికలపై మరో లేఖరాశారు. పెద్దలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. ఏకగ్రీవం చేయని పక్షంలో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ‘మా’ అసోసియేషన్ భవనాన్ని తాను, తన కుటుంబ సభ్యులం కట్టిస్తామని తెలిపారు.
10. INDvsSL: శ్రీలంకతో మ్యాచ్లు.. సమయ మార్పులు
మరికొద్ది రోజుల్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్లో స్వల్ప సమయ మార్పులు చేసినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే వన్డేలను అరగంట, 25 నుంచి ప్రారంభమయ్యే టీ20లను గంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?