గోదావరిఖనిలో సుడిగాలితో ఆటగాళ్ల పరుగులు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ క్రీడా మైదానంలో భారీ సుడిగాలి వీచింది. దాదాపు నిమిషం పాటు మైదానంలోని దూళి సుడిగాలిగా తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు....

Published : 07 Mar 2021 01:31 IST

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ క్రీడా మైదానంలో భారీ సుడిగాలి వీచింది. దాదాపు నిమిషం పాటు మైదానంలోని ధూళి సుడిగాలిగా తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్రికెట్‌ ఆడుతున్న క్రీడాకారులతోపాటు కొందరు ప్రేక్షకులు బయటకు పరుగులుపెట్టారు. కొద్దిసేపటికి సుడిగాలి తగ్గిపోవడంతో యథావిధిగా మ్యాచ్‌ నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని