Polavaram: 50 ఎకరాల్లోని వరి కుప్పలు దగ్ధం
ఏలూరు జిల్లా పోలవరం మండలంలో దాదాపు 50 ఎకరాల్లోని వరికుప్పలు దగ్ధమయ్యాయి.
పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టి సీమకు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం మొక్కజొన్న పొలంలో మంటలు వ్యాపించి దాదాపు 50 ఎకరాల్లోని వరి కుప్పలు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం మొక్కజొన్న వేసిన పొలంలో ఖరీఫ్లో పండించిన వరి కుప్పలు వేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఆ కుప్పలను నూర్చే ప్రయత్నంలో రైతులు ఉండగా అకస్మాత్తుగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 20 కుప్పలు కాలిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఎండ తీవ్రతకు తోడు ఈదురుగాలులు వీయడంతో క్షణాల్లో కుప్పలన్నీ కాలి బూడిదయ్యాయి. అప్పటికే ఇళ్లకు చేరుకున్న రైతులకు విషయం తెలియడంతో పరుగు పరుగున వెళ్లి కాలిపోయిన వరి కుప్పలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వరి కుప్పలతోపాటు అక్కడక్కడ మొక్కజొన్న పంటకు కూడా మంటలు అంటుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం