Modi Tour: ఎల్లుండి హైదరాబాద్లో మోదీ పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలివే..
ఈనెల 26న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్: ఈనెల 26న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఐఎస్బీకి 5 కి.మీ. పరిధిలో రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారా గ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్క్రాప్ట్స్ ఎగిరేందుకు నిషేధం విధించారు. ఇలాంటి వాటితో ఉగ్రదాడులు జరిగే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిందని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈనెల 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ప్రధాని పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలుకానున్నాయి. 26న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి.
*గచ్చిబౌలి స్టేడియం నుంచి ఐఐటీ కూడలి, ఐఐటీ కూడలి నుంచి విప్రో కూడలి వరకూ ఉన్న కంపెనీలు వారి పనివేళల్లో మార్పులు చేసుకోవాలి.
*గచ్చిబౌలి కూడలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్-కొండాపూర్ ఏరియా ఆస్పత్రి-మసీద్బండ-హెచ్సీయూ డిపో మీదుగా వెళ్లాలి.
*లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనదారులు హెచ్సీయూ డిపో, మసీద్ బండ, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ మీదుగా..
*విప్రో కూడలి నుంచి లింగంపల్లికి వెళ్లేవారు క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్పల్లి క్రాస్ రోడ్, హెసీయూ వెనుక గేట్, నల్లగండ్ల మీదుగా వెళ్లాలి.
*విప్రో కూడలి నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్గూడ, రోటరీ, ఓఆర్ఆర్, ఎల్అండ్ టీ టవర్స్ మీదుగా..
*తీగల వంతెన నుంచి గచ్చిబౌలి కూడలికి వెళ్లేవారు రత్నదీప్, మాదాపూర్ పోలీస్టేషన్, సైబర్ టవర్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?