Hyderabad: మేడ్చల్ మార్గంలో రోడ్డు కోత.. సుచిత్ర వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మేడ్చల్ మార్గంలో రోడ్డు కోతకు గురైంది. కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే దారిలో రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
హైదరాబాద్: నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మేడ్చల్ మార్గంలో రోడ్డు కోతకు గురైంది. కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే దారిలో రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి రావడంతో కొంపల్లి నుంచి మేడ్చల్ వెళ్లే మార్గంలో సుచిత్ర వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ప్రత్యా్మ్నాయ మార్గాల్లో వాహనాలను పంపించారు.
మరోవైపు కొంపల్లి ప్రాంతంలో పలు కాలనీల ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆయా కాలనీల్లో పర్యటించారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్