Telangana news: ఆ ఆరోపణలు వాస్తవం కాదు: రంగనాథ్‌

ట్రాఫిక్ చలాన్ల విషయంలో లక్ష్యాలు నిర్ధేశించి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వాస్తవం కాదని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

Published : 30 Apr 2022 18:02 IST

హైదరాబాద్‌: ట్రాఫిక్ చలాన్ల విషయంలో లక్ష్యాలు నిర్దేశించి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వాస్తవం కాదని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వాహనదారుల్లో క్రమశిక్షణ అలవాటు చేయడమే లక్ష్యంగా చలాన్లు వేస్తున్నామని తెలిపారు. చలాన్ల చెల్లింపులో కల్పించిన రాయితీతో గత 45 రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వానికి రూ.300 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు కొనసాగుతాయన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని