Train cancellation: రైలు దుర్ఘటన ఎఫెక్ట్‌: 19 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్‌ ఇదే..

బాలేశ్వర్‌లో రైలు దుర్ఘటన నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు రద్దయిన రైళ్ల జాబితాను ద.మ.రైల్వే విడుదల చేసింది.

Published : 06 Jun 2023 01:14 IST

సికింద్రాబాద్‌:  ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన(Odisha train accident) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా..  రైలు పట్టాలు ధ్వంసం కావడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో నిన్న రాత్రికి యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం పరిమితంగా రైళ్లను నడుపుతున్నారు. ఈ  నేపథ్యంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. షాలిమార్‌ నుంచి ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌కు వెళ్లాల్సిన (12841) రైలును సోమ, మంగళవారాల్లో రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 5న సంత్రగచి-తాంబరం రైలు(22841)తో  పాటు  హావ్‌డా-చెన్నై (12839); ఎర్నాకుళం-హావ్‌డా (22878) రైళ్లను రద్దు చేశారు. 

అలాగే, ఈ నెల 6న హావ్‌డా-సికింద్రాబాద్‌(12703), షాలిమార్‌-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (18045), హావ్‌డా-ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22887), సంత్రగచి-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (22807), ఎంజీఆర్‌ సెంట్రల్‌ చెన్నై-హావ్‌డా(12840), విల్లుపురం-ఖరగ్‌పూర్‌(2204), హైదరాబాద్‌ దక్కన్‌- షాలిమార్‌ (18046), షాలిమార్‌-తిరువనంతపురం (22642), గువాహటి-ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12510), అగర్తలా-ఎస్‌ఎంవీఈ బెంగళూరు (12504), సికింద్రాబాద్‌-షాలిమార్‌ (12774), సికింద్రాబాద్‌-హావ్‌డా(12704) రైళ్లను రద్దు చేసినట్టు రైల్వేఅధికారులు తెలిపారు. ఈ నెల 7 తేదీన  షాలిమార్‌ -సికింద్రాబాద్‌ (22849) రైలు, 9న సికింద్రాబాద్‌-షాలిమార్‌(22850) రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. 

పలు రైళ్ల రద్దుతో పాటు మరికొన్ని రైళ్ల వేళల్ని తాత్కాలికంగా రీషెడ్యూల్‌ చేశారు. సోమవారం సాయంత్రం 5.20గంటలకు బయల్దేరాల్సిన కన్యాకుమారి -దిబ్రూగఢ్‌ రైలు (22503) రైలును రాత్రి 10గంటలకు రీషెడ్యూల్‌ చేశారు. ఈ రాత్రి 7.10గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లే ప్రత్యేక రైలు (08583)ను మార్చి 8.15గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు